గోదావరి పుష్కరాల నిధులకు మంత్రి నారాయణ హామీ.
నర్సాపురం: జూలై 11,( తెలుగు న్యూస్ పవర్. కామ్) గోదావరి పుష్కరాల నాటికి నరసాపురం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో శనివారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగురునారాయణ మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కరాల ప్రధాన ఘాట్లు నరసాపురం మున్సిపల్ పరిధిలో ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, పట్టణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి…