Skip to main content

Telugu News Power

సాహితీవేత్త అప్పాజోష్యులకు రసధుని పురస్కారం.

పాలకొల్లు: జూలై, 19( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రసధుని సాహిత్య సంస్థ, గత 32 ఏళ్లగా అందిస్తున్న పెద్దభోట్ల బ్రహ్మయ్య స్మారక పురస్కారానికి, ఈ ఏడాది ప్రముఖ సాహితీ వేత్త, విశ్రాంత ఆచార్యులు, అప్పాజోష్యుల సత్యనారాయణ ను ఎంపిక చేసింది. ఈ నెల 26న స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో ఉదయం 10 గంటలకు ఈ పురస్కార కార్యక్రమం జరుగుతుందని అధ్యక్షులు కొట్టి భాస్కరరావు తెలిపారు. ఈ పత్రిక సమావేశంలో కార్యదర్శి వెంకటరత్నం, కోశాధికారి,…

Read More

ఈ దేశానికి నేనేమిచ్చాను. దాత కాశీ విశ్వనాధ రాజు ఫై కథనం.

భీమవరం: జూలై,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ దేశం నాకేమిచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేనేమిచ్చానని ఆలోచించే అత్యున్నత భావాలు కల వ్యక్తి ఉద్దరాజు కాశీ విశ్వనాథ రాజు. స్థానిక ప్రజలకు దాతగా సుపరిచితులు విశ్వనాథరాజు. సంపదను కూడబెట్టడమే గొప్పతనంగా భావించే ఈ రోజుల్లో, ఉద్దరాజు కాశీ విశ్వనాధ రాజు,సేవ, కరుణ, సామాజిక ప్రభావం అనే ప్రమాణాల గుర్తింపు పొందారు. మహాభారతంలోని దానకర్ణుడి పేరు తలపించేలా, ఆయనను అభిమానులు “అపార దాన కర్ణ”గా అభివర్ణిస్తారు….

Read More

బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి మెగా బ్రదర్స్ కు పెండ్లిపిలుపు.

హైదరాబాద్: జూలై,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) సినీ నటులు, పాపులర్ నిర్మాత బండ్ల గణేష్ కుమార్ వివాహానికి హాజరు కావాల్సిందిగా శనివారం, మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి దంపతులకు, పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు కుటుంబ సమేతంగా వెళ్లి పెండ్లి పత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈనెల 16న జరుగుతుంది.

Read More

జపాన్ లో ‘ఆవిరైపోతున్న’మనిషి

జనరల్ డెస్క్: జూలై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆ అమ్మాయి పోతున్నాడమ్మా మనిషి అంటాడు కవి అందేశ్రీ. ఇక్కడ మనిషి అంటే మనిషిలోని మానవత్వం కనుమరుగైపోతున్న పరిస్థితిని చూసి ఆవేదనతో రాసిన పాట అది. భారతదేశంలో ప్రజలు స్వతహాగా ఆత్మ అభిమానంతో ఉంటారు. అది వారి మూల నుంచి వచ్చిన వారసత్వ సంపద. బిచ్చగాడు లేని దేశంగా భారతదేశాన్ని విదేశీయులు కొయ్యాడిన పరిస్థితి. అయితే నేటి ఆధునిక పరిస్థితుల్లో, తాహతుకు మించి చేసే తప్పుల…

Read More

ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను ప‌రామ‌ర్శించిన మంత్రి లోకేష్.

హైదరాబాద్: జూలై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంగా, రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ ప‌రామ‌ర్శించారు. హైదరాబాద్ లోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ నివాసానికి శ‌నివారం సాయంత్రం వెళ్లిన లోకేష్‌ విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శ‌స్త్ర చికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచ‌న‌లు పాటించాల‌ని కోరారు. ఈ కలయిక…

Read More

వైసిపి శ్రేణుల కోసం జగన్ వదిలిన బ్రహ్మాస్త్రం 2.0 సూపర్ యాప్.

పాలకొల్లు: జులై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వైసీపీ కార్యాలయంలో శనివారం జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల కోసం ఈ యాప్ రూపకల్పన చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదురుకొంటున్న సమస్యలు, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు, పార్టీ కార్యక్రమాలు వంటివి అన్ని ఈ యాప్ లో ఉంటాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో,…

Read More

భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం – విక్రమ్-1 విజయవంతం.

తిరుపతి: జూలై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసిన విక్రమ్-1 రాకెట్ శనివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి కక్ష్యా రాకెట్‌ను ప్రయోగించిన మూడో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. “మిషన్ ఆగమన్” పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం, నాలుగు దశల్లో పూర్తిగా విజయవంతమైంది. అంతరిక్షంలోకి ఉపయోగించిన…

Read More

ఎఫ్ఎన్‌సీసీలో ఘనంగా ప్రముఖ నిర్మాత డాక్టర్ కె. వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు.

హైదరాబాద్: జులై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ నిర్మాత డాక్టర్ కె. వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఎఫ్ఎన్‌సీసీలో ఘనంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి తోడల్లుడు, సక్సెస్ ఫుల్ నిర్మాత డాక్టర్ కె. వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో అత్యంత వైభవంగా జరిగాయి. మెగా ఫ్యామిలీకి ఎంతో ఆప్తులైన వేడుక కావడంతో పలువురు ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరై సంతోషాన్ని పంచుకున్నారు. కేవలం కుటుంబ సభ్యుడిగానే కాకుండా, చిరంజీవికి ‘రౌడీ అల్లుడు’,…

Read More

ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకానికి అపార అవకాశాలు. -మంత్రి కందుల దుర్గేష్

న్యూఢిల్లీ: జూలై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) న్యూఢిల్లీలో శనివారంజరిగిన దేశీయ టూర్ ఆపరేటర్ల – అఖిల భారత చాప్టర్ చైర్మన్ ల సమావేశం –2026(ఏ డి టీ ఓ) లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. దేశీయ టూర్ ఆపరేటర్లతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలోని అపార అవకాశాలను పంచుకోవడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో…

Read More

పాలకొల్లుకు నీట్ 359 ర్యాంక్ అంత్యం వారి ఇంట హర్షాతిరేకాలు.

పాలకొల్లు: జూలై, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఇటీవల విడుదలైన వైద్య విద్య, నీట్ -2026 పరీక్ష ఫలితాల్లో, పాలకొల్లుకు చెందిన అంత్యం సాకేత్, 359 జాతీయ ర్యాంకు సాధించారు. వీరి తల్లిదండ్రులు రాజీవ్,దీప్తి ఇరువురు వైద్యులు. నానమ్మ అంత్యం గీతారాణి కూడా వైద్యురాలు. సాకేత్ మూడో తరానికి ప్రతినిధి. సాకేత్ విద్యలో తన ప్రతిభ చాటుకున్నారు. పదవ తరగతిలో 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి పట్టణంలో ప్రథముడిగా నిలిచారు. ఇంటర్మీడియట్లో వెయ్యి…

Read More