Telugu News Power

కలిసే ఉన్నాం, కలహాలు ల్లేవ్ -మాజీ ఎమ్మెల్సీ అంగర

పాలకొల్లు: మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) తన రాజకీయ ఎదుగుదలకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జన వనరుల శాఖామాత్యులు ఎంతగానో తోడ్పడ్డారని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు వెల్లడించారు. ఇటీవల వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును విమర్శిస్తూ, మాజీ ఎమ్మెల్సీ అంగన్ రామ్మోహన్రావు ఎదుగుదలకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా, స్థానిక మార్కెట్ యార్డ్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఎమ్మెల్సీ…

Read More

మంత్రి శ్రమదానంతో రుద్రభూమి పరిశుభ్రం.

పాలకొల్లు: మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక భగ్గేశ్వరం, లంకలకోడేరు గ్రామాల్లో కైలాస వనం వసతుల కల్పనకు రూ.65 లక్షలతో ప్రారంభించనున్న పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామస్తులతో కలిసి లంకల కోడేరు స్మశాన వాటికను శ్రమదానం తో పరిశుభ్రం చేశారు. ప్రతి జీవికి ఆఖరి మజిలీ అయినా స్మశాన వాటిక ఆహ్లాదకరంగా ఉండటానికి సుందరీకరణ పనులు, సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కృషి…

Read More

కూటమి ప్రభుత్వం మానవత్వానికి ప్రతిరూపం.-మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: మే, 24 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పేద ప్రజలు అనారోగ్య కారణంగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని, కుటుంబాలు కుదేలవకుండా కూటమి ప్రభుత్వం మానవత్వంతో వారికి సహాయం చేస్తుందని, స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో, 106 మందికి రూ. 49.40 లక్షల విలువైన చెక్కులను ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 20 నెలల కాలంలోనే, రూ.13.60 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి…

Read More

అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణంలో జరుగుతున్న కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులను స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం పరిశీలించారు. బొండాడ,ఎన్టీఆర్ కళాక్షేత్రం, 27 వార్డు క్రిస్టియన్ స్మశాన వాటిక, వంద పడకల ఆసుపత్రి సుందరీకరణ పనులను మంత్రి సంబంధిత ఏజెన్సీలు, అధికారులతో సమీక్షించి పోలీసు సూచనలు చేశారు.

Read More

ఈ నెల 31 నుంచి కాలువలకు నీళ్లు, గడువులోగా పనులు ముగించాలి. -రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల ఆదేశాలు.

పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మే నెలాఖకు పంట కాలువలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ ఇంజనీర్లతో జిల్లా సాగునీటి వ్యవస్థ పై సమగ్రంగా శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, వంట కాల్వల పనులు గడువుకు ముందే పూర్తి అయ్యేలా వేగం పెంచాలని సూచించారు. జలవనరుల శాఖకు సంబంధించి జిల్లాలో 492…

Read More

మంత్రిగారు వ్యక్తిగత విమర్శలు విరమించుకోండి. -మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు హితవు.

పాలకొల్లు: మే,23(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు అసహనంతో తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు హితవు పలికారు. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో శేషుబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ, దమ్ముంటే రాజకీయంగా తనను ఎదుర్కోవాలని సవాలు విసిరారు. గతంలో నిమ్మల రామానాయుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పుడు ఎంపీపీ,…

Read More

ప్రధాని మోడీ మాట, బంగారు భవితకు బాట. -రాష్ట్ర బిజెపి మీడియా కన్వీనర్ కపర్ది.

పాలకొల్లు: మే 22, (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుమేరకు, అందరూ పొదుపు చర్యలు పాటించాలని, బిజెపి రాష్ట్ర మీడియా కన్వీనర్, ఏఎంసీ మాజీ చైర్మన్, ఉన్నమట్ల కపర్తి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో, ప్రధాని మోడీ సూచించిన అంశాలు అనివార్యంగా ఆచరించవలసిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ప్రపంచంలో నెలకొన్న భయానక యుద్ధ పరిస్థితులు సృష్టించే సమస్యలకు ముందుగానే సిద్ధం కావటానికి ప్రధాని…

Read More

రైలులో ప్రయాణిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మే, 22 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా, పాలకొల్లు శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు శుక్రవారం రైలు బండిలో ప్రయాణించారు. వాహన రహిత రోజు (నో వెహికల్ డే) పురస్కరించుకొని, క్యాబినెట్లో ముఖ్యమైన స్థానంలో ఉండి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కూడా అయినా మంత్రి నిమ్మల ప్రోటోకాల్ పక్కనపెట్టి, రైలు పెట్టెలో సామాన్లతో కలిసి ప్రయాణం ప్రారంభించారు….

Read More

రొయ్యల రైతుల ఆగ్రహం రోడ్డు పాలైన కష్టార్జితం. క్రాప్ హాలిడే హెచ్చరిక.

పాలకొల్లు: మే, 22 (తెలుగు న్యూస్ పేపర్. కామ్) రొయ్యల రైతులు తమ డిమాండ్ల సాధన కోసం భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పూలపల్లి వై జంక్షన్ వద్ద శుక్రవారం జరిగిన నిరసన ప్రదర్శనలో రైతులు పండించిన రొయ్యలు రోడ్డుపై పారబోసి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. రొయ్యల రైతుల నడ్డి విరుస్తున్న సిండికేట్ల భాగోతంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఈ సందర్భంగా, విజ్ఞప్తి చేస్తూ, నాణ్యమైన సీడ్ అందించే ఏర్పాటు చేయాలని కోరారు….

Read More

నేడు, రేపు రైల్వే గేట్ మూసివేత.

పాలకొల్లు: మే, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు-భీమవరం రోడ్డులో ఉన్న రైల్వే గేట్ ఈనెల 21, 22 న రెండు రోజులపాటు రైల్వే ట్రాక్ మరమ్మత్తుల నిమిత్తం మూసివేస్తారని రైల్వే శాఖ తెలిపింది. ఇందువల్ల భీమవరం-పాలకొల్లు మధ్య ప్రయాణించే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లవలసిందిగా రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. రైల్వే గేటు శుక్రవారం ఉదయం 7 గంటలకు మూసివేసి, శనివారం రాత్రి 7 గంటలకు తెరుస్తారని రైల్వేశాఖ వివరించింది.

Read More