Telugu News Power

అజరామర అమరావతికి ఎల్లెడలా నీరాజనాలు.

భీమవరం: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్. కం) స్థానిక జిల్లా కేంద్రంలో అల్లూరి సీతారామరాజు స్మృతి కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆధ్వర్యంలో అమరావతి శాశ్వత రాజధాని ఇంకా చట్టం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆధులకు గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అధికారులు రాహుల్ కుమార్ రెడ్డి, నయీమ్ హష్మీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం…

Read More

రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే అర్హత జగన్ కు లేదు. -మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు.

పాలకొల్లు: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్.కాం) రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే అర్హత జగన్ కు లేదని మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ రంగారావు మోహన్ రావు తీవ్రంగా విమర్శించారు. అమరావతి శాశ్వత రాజధాని గా పార్లమెంటులో చట్టం చేయడంతో కూటమి శ్రేణులు అంగర ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజధానికి 33 ఎకరాలు ఇచ్చిన రైతులను రూట్ల పాలు చేసి వారిని, తీవ్రంగా ఇబ్బందులు ఫోన్…

Read More

రాజ్యసభలో శాశ్వత రాజధాని బిల్లు ఆమోదం ప్రత్యక్షంగా వీక్షించిన మంత్రి నారా లోకేష్.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్). అమరావతిని శ్వాశ్వత రాజధానిగా చట్టం చేయడానికి రాజ్యసభలో ప్రవేశపెట్టిన, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (సవరణ) బిల్లు ఆమోదం పొందటాన్ని, రాజ్యసభలో ప్రముఖుల గ్యాలరీలో కూర్చుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ బృందం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రుల బృందంతో ప్రధాని మోడీని కలిసారు. అను మోడీ నారా లోకేష్ కు అభినందనలు తెలియజేశారు. పార్లమెంటరీ…

Read More

రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటి అమరావతి రాజధాని సంబరాలు.

అమరావతి: ఏప్రిల్,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పెద్దల సభలో ఆమోదం లభించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. వాడ వాడల పిల్లాపాపలతో ఈ సంబరాలు జరుపుకున్నారు. కూటమి నాయకులు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాజధాని సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఇందుకోసం పుష్కరకాలం అని చికి నెలకొని ఉంది. అమరావతి శాశ్వత ప్రజారాజధానిగా, రైతుల త్యాగాల కోసం ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన నిలిచింది. సుమారు29వేల మంది రైతులు 34వేల…

Read More

6 వేల కోట్ల బకాయిలు విడుదలకు ముఖ్య మంత్రి అంగీకారం.

అమరావతి: ఏప్రిల్,2(తెలుగు న్యూస్.కాం) ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేయడానికి గురువారం సచివాలయానికి నాయకులు చేరుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఈ సందర్భంగా, కలుసుకొని 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని కోరారు. ఈ నెల 10 లోపు 6వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేసినట్టు వెల్లడించారు. సెక్రటరీ జనరల్, ఎస్ చిరంజీవి, తదితర ఫ్యాక్టో నాయకులు…

Read More

నేటి నుంచి పంచాయతీల లో ప్రత్యేక అధికారుల పాలన.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలు శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో కి వస్తుంది. ఇంతవరకు సాగిన సర్పంచ్ ల పాలన గురువారంతో ముగిసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం జి ఓ ఎం ఎస్ నెం.47 విడుదల చేసింది. ప్రభుత్వం ఇంతకుముందే చెక్కు పవర్ వద్దు ఉత్తర్వులు వెలువరించింది. ప్రత్యేక అధికారుల పాలన ప్రజలకు అందుబాటులో ఉండటం సమస్య కావచ్చునని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక అధికారులుగా ఎంపీడీవో, ఎమ్మార్వో, వ్యవసాయ అధికారి, పశువైద్యాధికారి, విద్యాశాఖ అధికారీ ఆయా మండలాల్లో…

Read More

నాసా ఆర్ట్మిస్ II అంతరిక్ష ప్రయోగం విజయవంతం.

ఫ్లోరిడా: ఏప్రిల్, 1(తెలుగు న్యూస్ పవర్. కామ్)అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ,నాసాచేపట్టిన ఆర్టెమిస్-II ప్రయోగం విజయవంతంగా ప్రారంభమై, మానవ అంతరిక్ష చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఆర్టెమిస్-II ప్రయోగం అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి 2026 ఏప్రిల్ 1న సాయంత్రం నాసా అత్యాధునిక అంతరిక్ష యానం వ్యవస్థ, (ఎస్ ఎల్ ఎస్) రాకెట్ ద్వారా ఆర్టెమిస్-II మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. నాసా ప్లస్ వన్ ఈ మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు…

Read More

అజరామరం రాజధాని అమరావతి.

న్యూఢిల్లీ/అమరావతి: ఏప్రిల్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ, సవరణ బిల్లు, 2026ను బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇది ఎన్డీయే మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ, అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీర్ఘకాల లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో ప్రవేశపెట్టగా,…

Read More

చేనేతకు 150 కోట్ల విద్యుత్ ఉచితం.

పాలకొల్లు: ఏప్రిల్, 1(తెలుగు న్యూస్ పవర్. కామ్) అభివృద్ధి, సంక్షేమ కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు వంటివని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. చేనేతకు ఉచిత విద్యుత్తు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక భగ్గేశ్వరంలో బుధవారం ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు, కూటమి ప్రభుత్వం బీసీలకు, ముఖ్యంగా చేనేతకారులకు అండదండలు అందిస్తుందని నిమ్మల తెలిపారు. చేనేత మగ్గం ఉన్న 93 వేల మందికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత…

Read More

విశాఖ కలెక్టర్ గా కిషోర్.

విశాఖపట్టణం: ఏప్రిల్, 1(తెలుగు న్యూస్ పవర్.కాం) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా, విశాఖ జిల్లా కలెక్టర్ గా ముట్టింబాకు అభిషిక్త్ కిషోర్, ఐఏఎస్ నియమితులయ్యారు. విశాఖ కలెక్టర్ కార్యాలయ చాంబర్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈ స్థానంలో పనిచేసిన, హరేంధిర ప్రసాద్ కాకినాడ కలెక్టర్ గా బదిలీపై వెళ్ళారు.

Read More