Telugu News Power

యలమంచిలి లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ.

యలమంచిలి:డిసెంబర్,5 (తెలుగు న్యూస్ పవర్) అయ్యప్ప స్వామి మహా పడిపూజ యలమంచిలి స్థానిక పుంతల ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. శంకర్ పీఠం ఆధ్వర్యంలో ఈ పడిపూజ జరిగింది. యలమంచిలి నరేంద్ర శర్మ ,చివటపు హనుమంతరావు, కాసా పుష్ప శంకర్ గురు స్వాములు పూజలు జరిపించారు. అనంతరం చించినాడ రేపూరి పవన్ స్వామి బృందం చే భజన కార్యక్రమం జరిగింది. అయ్యప్ప స్వాములకు భవానీలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు….

Read More

విద్యా వ్యవస్థ బలోపేతానికి విప్లవాత్మక మార్పులు – మంత్రి నిమ్మల

పోడూరు: డిసెంబర్ 5 (తెలుగు న్యూస్ పవర్) విద్యా వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా ఆత్మీయ సమ్మేళనం మూడో విడత సందర్భంగా జున్నూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర విద్యాశా ఖామాత్యులు,నారా లోకేష్, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, విద్యార్థులు మధ్య సమన్వయంతో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ…

Read More

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ రక్తదాన శిబిరం.

పాలకొల్లు:డిసెంబర్,5 (తెలుగు న్యూస్ పవర్)స్థానిక హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కార్యాలయంలో శుక్రవారం రక్తదాన శిబిరం జరిగింది. ప్రాణాలు కాపాడే సాయం అందరూ చేయాలని, ఇది ప్రపంచంలోనే ఒక గొప్ప అనుభూతి అనే నినాదంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు.అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ డిసెంబర్లో ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ పసుపులేటి అశోక్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ రక్త కేంద్రం,…

Read More

ఉపాధ్యాయుని సస్పెన్షన్

పాలకొల్లు:డిసెంబర్,4 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని ఆగరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చల్లా రవికుమార్ ను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు ఉపాధ్యాయుని పై అధికారులు ఈ చర్య తీసుకున్నారు. అయితే ఈ విచారణలో స్థానిక విద్యాశాఖ అధికారులు కాకుండా, బయట నుంచి వచ్చిన విద్యాశాఖ అధికారులు, ఐసిడిఎస్ అధికారులు సంయుక్తంగా,ఈ విచారణ చేసినట్టు సమాచారం. ఉపాధ్యాయునిపై వచ్చిన…

Read More

విజయ ల్యాబ్ బ్లడ్ గ్రూపింగ్ శిబిరం.

పాలకొల్లు:డిసెంబర్,4 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు,విజయ డయాగ్నొస్టిక్ ల్యాబ్ వారి సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల, మొదటి సంవత్సరం విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ శిబిరం నిర్వహించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రిన్సిపల్ టి. రాజరాజేశ్వరి తెలియజేశారు. విద్యార్థులు రక్తదానం చేయడానికి అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని పొందడానికి ఈ బ్లడ్ గ్రూపింగ్ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విజయ ల్యాబ్ అధినేత కాలేజీ గవర్నింగ్ బాడీ సభ్యులు కొమ్ముల మురళీకృష్ణ మరియు వారి…

Read More

ఉద్యోగార్థులకు శిక్షణ

పాలకొల్లు: డిసెంబర్,4 (తెలుగు న్యూస్ పవర్)ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు ప్రస్తుతం ఇచ్చే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి పేర్కొన్నారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి, ప్రభుత్వ అటానమస్ కళాశాల లో డిగ్రీ చివరి ఏడాది విద్యార్థుల కోసం ఈ శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభించారురు. విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వారం రోజులపాటు జరుగుతుంది. మహిళా సాధికార విభాగం, జవహర్ నాలెడ్జ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో…

Read More

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

సఖినేటిపల్లి:డిసెంబర్,4(తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని అంతర్వేది లో వేంచేసి ఉన్న, శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సంబంధించి ఉత్సవ ఏర్పాట్ల గురించి గురువారం అధికారులు సమీక్షించారు. ఈ ఉత్సవాలు జనవరి,25 నుంచి మొదలై ఫిబ్రవరి,2తోముగియనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో తొలి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మండపం అలంకరణ, రథాన్ని సన్నద్ధం చేయటం, శ్రీవారి చక్రస్నానం ఏర్పాట్లు, చలువ పందిర్లు, విద్యుత్ సౌకర్యం, క్యూలైన్లు…

Read More

వజ్ర సంకల్పం ముందు వైకల్యం ఓటమి

పాలకొల్లు:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) వైకల్యాన్ని ఎదిరించి నిలిచిన నిలువెత్తు స్ఫూర్తి వేదాంతం సదాశివమూర్తి. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలానికి చెందిన, ప్రస్తుతం పాలకొల్లులో స్థిరపడ్డ వీరి జీవితం దివ్యాంగులకు ఓ ఆచరణీయ మార్గదర్శి. రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లు మోకాలు వరకు తొలగించవలసి వచ్చింది. తీవ్రమైన శారీరిక బాధను మానసిక వేదనను తట్టుకుని నిలబడిన మేరు పర్వతం సదాశివమూర్తి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పట్టా పొంది, ద్విచక్ర వాహనాలు, ముఖ్యంగా బుల్లెట్ వాహనాలను ఎంత…

Read More

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం.

పాలకొల్లు:డిసెంబర్,3(తెలుగు న్యూస్ పవర్) ప్రతి ఏటా డిసెంబర్ 3 న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి 1992లో ఈరోజు దివ్యాంగుల కోసం అధికారికంగా ప్రకటించింది. అప్పటినుంచి ప్రపంచ దేశాలన్నీ ఈ సామాజిక బాధ్యత తీసుకుని ముందుకు నడుస్తున్నాయి. వికలాంగులను వేరుగా చూడకుండా, వారు కూడా మనలో ఒకరిగా చూడాలని ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. దివ్యాంగులు అంటే అంటే సమాజం చిన్న చూపు చూస్తుంది. అయితే ఆ భావన నిరాధారమైనది. సమాజంలో వీరిని అసహజం,అసమర్థులుగా…

Read More

వైసీపీ నేతలకు సిఐడి నోటీసులు

యలమంచిలి:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి మండలం వైసిపి అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు మంగళవారం సిఐడి నోటీసులు అందుకున్నట్టు వెల్లడించారు. టిడ్కో ఇల్లు పంపిణీ సభ సందర్భంగా, 2022 లో జరిగిన ఘర్షణకు సంబంధించి ఈ నోటీసులు అందుకున్నామన్నారు. అప్పటి శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ప్రోటోకాల్ పాటించకపోవడం,తనపై దాడి చేశారని పలువురు వైసిపి నాయకులు పై కేసు పెట్టారని తెలిపారు. ఇది తనపై టిడిపి పార్టీ వారు పెట్టిన ఐదో కేసుగా ఆయన వివరించారు. వైసిపి…

Read More