Skip to main content

Telugu News Power

మండల పరిషత్ సమావేశంలో అభివృద్ధి పనులపై సమీక్ష.

యలమంచిలి: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం, అధ్యక్షురాలు ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ప్రోటోకాల్ నిబంధనలను పాటించడం లేదని ప్రజా ప్రతినిధులు ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అధికారుల నుంచి అందకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మధ్య సమన్వయ లోపం…

Read More

ధర్మారావు ఫౌండేషన్ వారి చలివేంద్రాలు ప్రారంభించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ధర్మారావు ఫౌండేషన్ వారి సేవ కార్యక్రమాల్లో భాగంగా, మూడు రద్దీ ప్రదేశాల్లో మజ్జిగ చలివేంద్రాలు మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం ప్రారంభించారు. వివిధ కారణాలతో పట్టణానికి వచ్చే బాటసారులకు వేసవి తీవ్రత దృష్ట్యా దాహార్తిని తీర్చడానికి ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్నట్లుగానే, ఈ ఏడాది కూడా స్థానిక గాంధీ బొమ్మల సెంటర్, పెద గోపురం, ఛాంబర్స్ కాలేజీ ఆర్చ్ దగ్గర ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి…

Read More

ఇంధన కొరత తీర్చకపోతే ఉద్యమిస్తాం. వైయస్సార్ సిపి ఇంచార్జ్ గుడాల గోపి.

పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో 9నెలలకు సరిపడ ఇంధన నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ, ఎందుకు ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని పాలకొల్లు, భీమవరం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ప్రశ్నించారు. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో గుడాల గోపి ఇంధన సరఫరా ఇబ్బందులపై మాట్లాడారు. ఈ సమావేశంలో, మాజీ ఎమ్మెల్యే ప్రసాద రాజు, సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి, మంత్రులు బ్లాక్ మార్కెట్…

Read More

ఇంధన కొరత లేకుండా చూడాలి. -అధికారులకు మంత్రి ఆదేశాలు

పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) పెట్రోలు, డీజిల్ ఇంధన కొరత లేకుండా చూడాలని,రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులుమంత్రి నిమ్మల రామాల రామానాయుడు ఆదేశించారు. జిల్లా అధికారులతో మంత్రి ఇంధన కొరతపై టెలికాన్ఫరెన్స్ సోమవారం నిర్వహించారు. ప్రస్తుత ఇంధన కొరతకు సంబంధించి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుత వరి కోతలు ముమ్మరంగా ఉన్న సందర్భంగా, రైతులకు, ఆక్వా రైతులకు ప్రాధాన్యత ఇచ్చి ఇంధనం సరఫరా చేయాలని సూచించారు. కొన్ని ఏజెన్సీల సరఫరా పూర్తిస్థా యి చేయకపోవడం వల్ల, విద్యుత్…

Read More

ట్రోలింగ్ మధ్య టాప్ ర్యాంక్: ఓ బాలిక ధైర్యం

అందమైన లోకమని, రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. ఆకలి, ఆశలు ఈ లోకానికి మూలమమ్మ, ఆకలికి అందం ఉందా? ఆశలకు అంతం ఉందా? అంటూ తత్వాన్ని బోధించారు మనసు కవి ఆత్రేయ. అందమైన గులాబీకి కూడా ముళ్ళు ఉంటాయి, కానీ తన సహజ సమ్మోహన వాసనకు అవి అడ్డు కాదన్నారు కూడా. ఇంతకీ ఈ ఉపమానం ఎందుకు అనుకుంటున్నారా, ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రాచి నిగం అనే…

Read More

జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించిన ప్రముఖ నటి లక్ష్మి.

భీమవరం: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ రంగస్థలం నటి, ముమ్మారు నంది అవార్డు గ్రహీత బొండాడ (భీమవరం) లక్ష్మి (61) తన జీవిత రంగస్థలం నుంచి ఆదివారం రాత్రి తన పాత్ర ముగించి, రంగస్థలం నుంచి కూడా నిష్క్రమించారు. ఈమె భర్త టైలరింగ్ చేస్తారు. కుమారుడు మధు డాన్స్ ఈవెంట్లు నిర్వహిస్తారు. భీమవరానికి చెందిన లక్ష్మీ నాలుగున్నర దశాబ్దాల రంగస్థల చరిత్రలో బహుముఖ పాత్రలు పోషించి, నాటక సామ్రాజ్నిగా వెలుగొందారు. ఆమె నాటిక, నాటకం,…

Read More

డీజిల్ పెట్రోల్ కొరత లేదు. -జె సి రాహుల్ కుమార్ రెడ్డి

భీమవరం: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) జిల్లాలో రోజుకు మూడు లక్షల లీటర్ల డీజిల్ ఆయిల్ అవసరం కాగా, రోజు 4.5 లక్షల లీటర్ల సరఫరా అవుతుందని ఆదివారం కలెక్టరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇందువల్ల డీజిల్ కొరత ఏర్పడే అవకాశం లేదన్నారు. వ్యవసాయ మధ్య పరిశ్రమకు సంబంధించి ప్రాధాన్యత రంగాలకు తగిన విధంగా డీజిల్ సరఫరాకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రైతులకు విఆర్ఓ ద్వారా కూపన్లు…

Read More

జోన్లు ఏర్పాటులో ఉద్యోగుల తో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలి. -ఉద్యోగ సంఘ నేత శ్రీకాంతరాజు డిమాండ్.

పాలకొల్లు: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) కొత్తగా ఏర్పాటు చేసే జోనల్ విధానాల్లో ఉద్యోగుల ను భాగస్వాములను చేయటానికి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్యక్షులు శ్రీకాంతరాజు డిమాండ్ చేశారు. స్థానిక పింఛనుదారుల సంఘ భవనంలో ఆదివారం జరిగిన మహిళ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సమస్యలపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో రాజు మాట్లాడుతూ, డి.ఏ.బకాయల విడుదల, పి ఆర్ సి కమిటీ…

Read More

చర్లపల్లి రైలు ప్రారంభించిన కేంద్రమంత్రి వర్మ.

నర్సాపురం: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రైల్వే స్టేషన్ నుంచి నరసాపురం – చర్లపల్లి (17061 / 17062) ఆదివారాల్లో నడిచే ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆదివారం రాత్రి 8 గంటలకు స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానికఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ , నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ పొత్తూరి రామరాజు పాల్గొన్నారు. నరసాపురం–హైదరాబాద్ మధ్య ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచే…

Read More

ఉద్యానవన పంటలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం.

అమరావతి, ఏప్రిల్ 24: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా… రైతులకు భద్రత, అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు. డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని,ఏది లాభదాయకమో దాని గురించి వివరించి చెప్పాలని సీఎం కోరారు. పంటలు 365 రోజులు పంటలు పండించేలా చూడాలని, భూమిని భాగాలుగా విభజించి ఒకే రైతు వివిధ రకాల పంటలు…

Read More