Skip to main content

Telugu News Power

ఒక్క పూట మాత్రమే కుళాయినీరు. -పురప్రజలు సహకరించాలి కమిషనర్ విజయ సారధి.

పాలకొల్లు: మే, (తెలుగు న్యూస్ పవర్. కామ్). ఈనెల 8 నుంచి ఒక్క పూట మాత్రమే రక్షిత మంచినీరు సరఫరా జరుగుతుందని పొరపాలక సంఘ కమిషనర్ విజయ సారథి మంగళవారం ప్రకటించారు. ప్రతిరోజు ఉదయం గం. 6 నుంచి గం.7 వరకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. సాయంత్రం పూట నీటి సరఫరా జరగదని వెల్లడించారు. రైతులకు అవసర మైన సాగునీటి సరఫరా కోసం కాలువల తవ్వకం, వంతెనల నిర్మాణం వంటి పనుల వల్ల కాలువలకు నీటి సరఫరా…

Read More

కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయుష్ సేవలు ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి.

భీమవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ఆయుర్వేద వైద్య సేవల శిబిరం కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టర్ చదలవాడ నాగరాణి, సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. దేశీయ ఆయుర్వేదం పట్ల ప్రజలు అనిపించుకోవాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్,బీపీ, చర్మరోగాలకు కీళ్లవ్యాధులకు ఉచితంగా మందులు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఈ వైద్య సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అందిస్తున్న సేవలు గురించి కలెక్టర్ కు డాక్టర్…

Read More

మహా మౌనసంకల్పనికి, శిరస్సు వంచిన ఎవరెస్టు శిఖరం!!!

జనరల్ డస్క్: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఈ భూమి మీద పడ్డ ప్రతి జీవికి, పరమార్థం నిర్దేశించి పంపుతాడు దేవుడు. దైవం కూడా మానవుడిలా అప్పుడప్పుడు, తప్పులు చేయడం సహజంమేనేమో! ఆ తప్పును దిద్దుకోవటానికి, మరో రూపంలో శక్తియుక్తులు ప్రసాదించటం కూడా విధి లీల. అలాంటి, వరం అందుకున్న, అన్నమనీడి దైవ వెంకట సత్యనారాయణ కథే ఇది. చూపులకు ఎక్కడ కనపడని లోపం, మనసు నిండా వజ్ర సంకల్పం, గుండె నిండా నింపుకొన్న ధైర్యం ఉన్న…

Read More

ప్రపంచ తెలుగు ఖ్యాతికి ప్రతీక దాసరి. -మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: ఏప్రిల్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ తెలుగు ఖ్యాతికి దాసరి నారాయణరావు ప్రతీకని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దాసరి నారాయణరావు 79వ జన్మదినోత్సవం సందర్భంగా, సోమవారం, స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర గల దాసరి నారాయణరావు కాంస్య విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. వంగ నరసింహారావు,యర్రం శెట్టి వెంకటరత్నం, మేడికొండ శ్రీనివాస్ చౌదరి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,…

Read More

ఆడపిల్లే కదా అనుకోవద్దు, అవకాశం ఇస్తే వారికి ఆకాశమే హద్దు. -తల్లులకు మంత్రి నిమ్మల హితవు.

పాలకొల్లు: మే, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆడపిల్లే కదా అని బాలికలపట్ల వివక్ష చూపరాదని, స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు తల్లులకు హితవు పలికారు. పూలపల్లి, ఆగర్రు, వెలివిలి గ్రామాల 8,9, 10 తరగతుల విద్యార్థులకు స్థానిక పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీసీఎల్ ఇండియా లిమిటెడ్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ నిధులతో ఆదివారం జరిగిన ఉచిత సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,…

Read More

పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ఆయువు: మంత్రి కందుల దుర్గేష్

అమరావతి:మే,3(తెలుగు న్యూస్ పేపర్. కాం.) ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా, మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులకు ఆదివారం శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్ట్ ఒక సామాజిక యోధుడని, పత్రికా స్వేచ్ఛ అనేది కేవలం జర్నలిస్టుల హక్కు మాత్రమే కాదు, అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు వంటిది అని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం నాలుగో స్తంభం వంటిదని, సమాజంలోని వాస్తవాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర…

Read More

అభివృద్ధి పనులకు రూ. 3.08 కోట్ల నిధుల మంజూరు. -మంత్రి నిమ్మల శంకుస్థాపనలు

పాలకొల్లు: మే, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణంలోని 1 నుంచి 15 వార్డుల్లో రూ.3.08 కోట్ల తో ప్రారంభించనున్న అభివృద్ధి పనులకు, స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మోటార్ సైకిల్ పై సుడిగాలి పర్యటన చేశారు. గత వైసిపి ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసం వల్ల ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, అభివృద్ధి,…

Read More

పదో తరగతి ప్రతిభావంతులకు సత్కారం.

యలమంచిలి:మే,3(తెలుగు న్యూస్ పవర్. కామ్) బుంగ తాతబ్బాయ్ ఫౌండేషన్ చైర్మన్, సీనియర్ జర్నలిస్టు బిఇ తిరుమల రాజు చేస్తున్న సమాజ సేవా కార్యక్రమాలు అభినందనీయం అని మట్లపాలెం సర్పంచ్ చల్లా విశ్వేశ్వరరావు అభినందించారు. చదువుకునే విద్యార్థులు అంటే తిరుమల రాజు కి ఏంతో ఇష్టమని అందుకే ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైన విద్యార్థులకు, విద్యా సామాగ్రి అందజేసి ప్రోత్సాహిస్తారని కొనియాడారు. మట్లపాలెం ఉన్నత పాఠశాల లో చదివి పదవతరగతి పరీక్షలలో జిల్లా టాప్ ర్యాంకర్ గా నిలిచిన అంబటి…

Read More

చెరువు భూమిలో అక్రమ ఇళ్ల తొలగింపు . అర్హులకు ప్రభుత్వ ఇళ్ళు -కలెక్టర్ భరోసా.

వీరవాసరం: మే ,2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మత్స్యపురి గ్రామం చెరువు పోరంబోకు భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్ల తొలగింపు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి బాధితులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. తొలగించిన ఇళ్లలో అర్హత కలిగిన 16 మందిని గుర్తించి, వారికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి రుణాలు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. డ్వాక్రా…

Read More

జలవనరుల శాఖకు రూ. 397 కోట్ల నిధులు. నామినేషన్ పై రూ. 10 లక్షల లోపు పనులు. -మంత్రి నిమ్మల వెల్లడి.

పాలకొల్లు: మే,3(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర జలవనరుల శాఖకు రూ.397 కోట్ల నిధులు మంజూరైనట్టు రాష్ట్ర జనవరిలో శాఖ మాత్యులు, పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం వెల్లడించారు. జల వనరుల శాఖ తరపున ముఖ్యమంత్రి కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో చివరి ఎకరం వరకు నీటి సరఫరా జరగాలని లక్ష్యంతో, రైతులకు, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ, ఇప్పటివరకు సుమారు రూ.1100 కోట్ల నిధులు కూటమి ప్రభుత్వం కేటాయించిందన్నారు. అత్యవసరంగా అవసరమైన, కాలువలు,చెరువులు,…

Read More