Skip to main content

Telugu News Power

పంచాయతీ కార్మికుడ్ని విధుల్లోకి తీసుకోవాలి. -వర్కర్స్ యూనియన్, సిఐటియు డిమాండ్.

యలమంచిలి: మే, 7 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నేరేడుమిల్లి పంచాయతీ లో గత 17 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కృష్ణంరాజును డ్యూటీకి రావద్దని చెప్పడం అన్యాయమని, తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్, మండల కమిటీ డిమాండ్ చేసింది. మండల కమిటీ ఆధ్వర్యంలో నేరేడుమిల్లి పంచాయతీ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం ఆంజనేయులు అధ్యక్షులు మానుకొండ శివరావు సిఐటియు…

Read More

చవాకుల ట్రస్ట్ చలివేంద్రం ఏర్పాటు.

పాలకొల్లు: మే,7(తెలుగు న్యూస్ పవర్. కామ్) చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, పాలకొల్లు రైల్వే గేట్ వద్ద ఏర్పాటుచేసిన రస్నా చలివేంద్రం కేంద్రం వద్ద పలువురు బాటసారులకు గురువారం దాహార్తిని తీర్చారు .ఈ ఈ చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పెచ్చెట్టి వెంకట నరసింహారావు (బాబు) విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ చవాకుల సూర్య నరేష్ బాబు ,…

Read More

విప్లవ జ్యోతి అల్లూరికి ఘన నివాళి.

భీమవరం: మే,7(తెలుగు న్యూస్ పవర్. కాం) విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా గురువారం, స్థానిక అడ్డవంతెన వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలు వేసి ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తిఘనంగా నివాళులర్పించారు. ఈ ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన పిడిఎఫ్ ఎమ్మెల్సీ, అల్లూరి ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు అందించే ఘన నివాళి అన్నారు. అల్లూరి ప్రజలను సమీకరించి, పోరుబాట పట్టించి స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని కొనసాగించారన్నారు. సామాన్య ప్రజల కోసం తన…

Read More

మంత్రి పిలుపుతో సేదతీరిన శ్రామికులు.

పాలకొల్లు: మే, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు ఉపాధి హామీ శ్రామికుల, దాహార్తిని తీర్చేందుకు మొబైల్ మజ్జిగ చలివేంద్రాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన టిడిపి శ్రేణులు మజ్జిగ అందజేశారు. నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకంలో పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా, పాలకొల్లు మండలం, తిల్లపూడి, గవరపేట, దగ్గులూరు, అరట్లకట్ట, వరి ధనం, సగం చెరువు, పూలపల్లి, చింతపర్రు, ఆగర్తిపాలెం, వెంకటాపురం, లంకల కోడేరు, వెలివిలి,…

Read More

రామదాసు కు ఎస్పిఓగా పదోన్నతి.

పాలకొల్లు: మే, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్). స్థానిక కోడిగట్టు సూర్యదేవాలయం వ్యవస్థాపక ధర్మకర్త, కళాకారులు, ప్రభుత్వ ఆసుపత్రి ఫార్మసిస్ట్ మేడికొండ రామదాసు ఎస్ పి ఓ గా పదోన్నతి పొందారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం వీరు తణుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతి పొందిన రామదాసుని పలువురు అభినందించారు.

Read More

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బొర్రా గోపీమూర్తి.

యలమంచిలి:మే,5(తెలుగు మూవీస్ పవర్.కాం) పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలో తన స్వగ్రామైన నార్నిమెరక పంచాయతీ గమల్లపేటలో అంబేద్కర్ విగ్రహానికి, దివంగత టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి చిత్రపటానికి, మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుపిఎస్ విజయరామరాజు, పోలిశెట్టి క్రాంతి కుమార్, రాష్ట్ర బాధ్యులు రామానుజ రావు జిల్లా కార్యదర్శి రామకృష్ణ యుటిఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి ఎస్ జయప్రభ సిఐటియు…

Read More

పోతనకు బహుమతి తెచ్చిన “జయహే”.

గుంటూరు/పాలకొల్లు: మే,5(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీల్లో, ప్రముఖ సినీ,నాటక రచయిత, పాలకొల్లుకు చెందిన వీర పోతన రచించిన “జయహే” నాటిక ప్రధమ బహుమతి గెలుచుకుంది. గుంటూరు, కొలకలూరు నాటక పరిషత్ వారు ఈనాటికి పోటీలు నిర్వహించారు. పోతనకు 20వేల నగదు బహుమతి, షీల్డ్ ఇచ్చి పరిషత్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు గోపరాజు రమణ, విజయ్, పలువురు నాటకరంగ పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణ ప్రముఖులు,నటీనట సమాఖ్య…

Read More

ధర్మ రావు ఫౌండేషన్, అగ్ని బాధితులకు సాయం.

పాలకొల్లు: మే,5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక లంకలకోడేరు గ్రామంలో అగ్ని బాధితులకు ధర్మారం ఫౌండేషన్ వారు మంగళవారం సాయం అందజేశారు. మూడు కుటుంబాల వారు ఈ అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులయ్యారు. వీరికి 26 కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు, వంట సామాగ్రి, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, పాముల రజిని కుమార్, ఆకుల ధనలక్ష్మి స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read More

మద్యం షాపులో అగ్ని ప్రమాదం. రూ. 1.40 కోట్ల మద్యానికి ముప్పు.

యలమంచిలి:మే, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాలంపూడి గ్రామంలో బూన్ వైన్స్ షాపులో అగ్నిప్రమాదం రాత్రి 11 గంటల సమయంలో తమకు వచ్చిన ఫోన్ కాల్ ద్వారా గుర్తించినట్టు నరసాపురం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాంబాబు మంగళవారం తెలియజేశారు. ఈ షాపులో రూ. 1.40 కోట్ల విలువైన మద్యం నిల్వలు ఉన్నట్టు తెలిపారు. ప్రమాదంలో 90 శాతం వరకు సరుకు నష్టం జరిగిందని తాత్కాలిక అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎదురుగా ఉన్న కూడా ఉన్నా కూడా కొంత…

Read More

డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్ట్ లు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మే, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలమూరు శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, మంగళవారం తన క్యాంపు కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్ట్ లు పంపిణీ చేశారు. జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ (ఎన్ ఇ సి సి) వారి సౌజన్యంతో 50 వేల రూపాయల విలువైన, వ్యాపారానికి అవసరమైన బండి కుర్చీలు, ఇతర సమస్త సామాగ్రి ఉచితంగా అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళల కోసం డ్వాక్రా పథకం తీసుకువచ్చారన్నారు….

Read More