Telugu News Power

రఘు బాబు ఆకస్మిక మృతి, విషాదంలో పాలకొల్లు.

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎడ్ల బజారు సెంటర్లో వేంచేసి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ గురుస్వామి, సోదరులు రఘు గురుస్వామి శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. వీరి మరణం పాలకొల్లును విషాదంలో నింపింది. గురుదేవులు, ఎస్టిపివి ఆచార్యుల కుమారులు వీరు. ఎందరికో ఆత్మీయ బంధువు. భక్త జనుల కోసం ఎంతగానో తరితిపించిన నిస్వార్థ దైవ భక్తులు. స్థానిక గజలక్ష్మి ప్రాంతంలో అప్పటికప్పుడు, ఏర్పాట్లు చేసి, అయ్యప్ప స్వామి వారి…

Read More

పాఠశాలకు 3.60 లక్షలు మంజూరు.

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక 31వ వార్డు, వడలివానిపేట ప్రాథమిక పాఠశాల, మరుగుదొడ్ల నిర్మాణానికి, మంత్రి నిమ్మల రామానాయుడు 3.60 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. ఈ పనులకు శుక్రవారం కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, ఉన్నమట్ల కాపర్తి, అన్నదాన సత్రం కమిటీ సభ్యులు సత్యనారాయణ, పలువురు కోటి నాయకులు పాల్గొన్నారు.

Read More

జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) జాతిపిత, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం, వైశ్య సంఘం వారు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బంగారు వారి ఆర్యవైశ్య కళ్యాణమండపంలో, మహాత్మా గాంధీ, విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, రాపాక ప్రవీణ్ భాను పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా, అమర జీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి సనిశెట్టి లీలా భావనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి, పాత…

Read More

ఇద్దరమ్మాయిలు కు గ్రూప్-2 లో విజయం.

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరు వాస్తవ్యులు, గురుజు దివాకర్, కుమార్తె లక్ష్మీ అంజన, గ్రూప్-2 పోటీ పరీక్షలో విజయం సాధించారు. ఈమె, పోలీస్ శాఖలో డి.ఎస్.పి ఉద్యోగానికి ఎంపికయ్యా. ప్రస్తుతం వీరు పాలకొల్లులో ఉంటున్నారు. తండ్రి దివాకర్, భీమవరం సి ఐ కార్యాలయంలో రైటర్ గా ఉద్యోగం చేస్తున్నారు. తల్లి హేమలత ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు. ఈమె తాతగారు కూడా పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసారు. ఈ సందర్భంగా, పెదనాన్న, ఈనాడు మాజీ…

Read More

గజ, పొన్న వాహనములపై నరసింహ స్వామి గ్రామోత్సవం.

సఖినేటిపల్లి: జనవరి30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అంతర్వేది, దక్షిణ కాశి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారు, గజ, పొన్న వాహనములపై గ్రామోత్సవం చేశారు, భక్తులను అనుగ్రహించారు. స్వామివారు, సాయంత్రం, గజవాహన గ్రామోత్సవం విశిష్టత గురించి అర్చక స్వాములు వెల్లడించిన విశేషాలు. గజరాజులు రాజసానికి ప్రతీకలు. రణరంగంలో, రాజ దర్బారులో, ఉత్సవాల్లో గజరాజు ప్రాధాన్యతా స్థానం. గజరాజు తనపై స్వామివారిని అధిష్టించుకున్నట్టు, భక్తులు తమ హృదయ పీటికపై స్వామివారిని ఆగష్టించుకుని…

Read More

పొన్న వాహనం పై స్వామివారి గ్రామోత్సవం.

స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా, శుక్రవారం, ఆరో రోజు రాత్రి, స్వామివారు పున వాహనంపై ఊరేగారు. ఈ వాహనం ప్రత్యేక సంతరించుకుంది, మిగతా వాహనాలన్నీ, వివిధ రూపాల్లో ఉంటే, పొన్న వాహనం మాత్రం, మహాభారత ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. కృష్ణుడు, గోపికల చీరలు దొంగిలించకపోయే ఘట్టం మధ్యలో నరసింహుడు లక్ష్మీసమేతుడై, కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తారు. పొన్న వృక్షం అంటే కల్ప వృక్షం. ఈ వృక్షంపై ఉన్న స్వామివారి దర్శించుకుంటే సకల కోరికలు సిద్ధిస్తాయని, పొన్నవాహన సేవ…

Read More

శివరాత్రి ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి సమావేశం.

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి సమావేశం శుక్రవారం స్థానిక అభిషేక మండపం నందు నిర్వహించారు. ఈ సమావేశానికి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు అధ్యక్షత వహించారు. వచ్చేనెల 15వ తేదీన జరిగే శివరాత్రి మహోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. భక్తుల సౌకర్యార్థం, చలువ పందిళ్లు, వేయించడం, దర్శనాలకు తగినట్టుగా క్యూలైన్ల ఏర్పాటు, విద్యుత్ వెలుగుల అలంకరణ, భక్తులకు మంచినీటి సౌకర్యం,…

Read More

అంతర్వేది రథోత్సవం, భక్తజనుల కోలాహలం

సఖినేటిపల్లి;జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం, గురువారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. ఉగ్ర నరసింహ స్వరూపం గల,స్వామివారు పెళ్లి కళ సంతరించుకొని, పెళ్ళికొడుకై తరలిరాగా, లక్ష్మీదేవి అమ్మవారు, సిగ్గులొలుకుతూ, పెళ్లికూతురై వివాహ వేదిక చేరుకున్నారు. స్వామివారి కల్యాణ వేడుక బుధవారం రాత్రి గడియలు దాటి 1.56 గంటల ముహూర్తానికి గురువారం జీలకర్ర బెల్లం పెట్టే దృశ్యం చూసి భక్తులు తరించిపోయారు. మంగళసూత్ర ధారణ తదితర వివాహ క్రతువు పండితులు జరిపించారు. ఈ ఏడాది…

Read More

వార్డు అధ్యక్షులుగా అడ్డాల.

పాలకొల్లు: జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) స్థానిక 27 వార్డు వైసిపి కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి, నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు అధ్యక్షత వహించారు పార్టీ సంస్థాగత బలోపేతం గురించి చర్చించారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావడానికి వ్యూహాలు పై సమాలోచనలు చేశారు. ఈ సమావేశంలో, వైఎస్ఆర్సిపి ప్రముఖ సీనియర్ నాయకులు అడ్డాల నారయ్యను స్థానిక వార్డు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సమావేశంలో పెదగోపురం మాజీ చైర్మన్ కోరాడ…

Read More

మావుళ్ళమ్మ ఉండి లెక్కింపు.

భీమవరం: జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు గురువారం జరిగింది. సుమారు, 59,25,412 నగదు, కానుకల ద్వారా మొక్కులు తీర్చుకున్న భక్తులు సమర్పించుకున్నారు. బంగారం 45.100గ్రాముల, వెండి 210 గ్రాములు భక్తులు హుండీలో వేశారు. వివిధ విదేశీ కరెన్సీ నోట్లు అమ్మవారికి భక్తులు సమర్పించుకున్నారు.

Read More