మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ నిధి నుంచి సత్వరం నిధులు అందిస్తున్నారని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాలకొల్లు హౌసింగ్ బోర్డ్ లో ఉన్న వారి క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటైన సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల కాలంలో ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే 10 కోట్ల రూపాయల నిధులు సీఎం సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు అందాయన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల కుటుంబాలు అనారోగ్య కారణంగా కుటుంబాలు కుదేలు అవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి పేదవర్గాల పట్ల ఉన్న ఆప్యాయతతో సత్వరమే ఈ నిధులు విడుదల చేస్తున్నారన్నారు. నియోజకవర్గ పరిధిలోని 37 మంది లబ్ధిదారులకు 21.33 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. ఈ సాయం అందుకున్న వారు మరో పది మంది కి చెప్పాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
