Skip to main content

Telugu News Power

శ్రీనివాస బ్రహ్మోత్సవం ఊరేగింపు

బ్రహ్మోత్సవ ఊరేగింపులో తరలివెళుతున్న శ్రీనివాసులు

పాలకొల్లు డిసెంబర్ 22 తెలుగు న్యూస్ పపర్ ఉభయగోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం శ్రీనివాస బ్రహ్మోత్సవ ఊరేగింపు, పాలకొల్లు పురవీధుల్లో వివిధ కళా ప్రదర్శనలతో ఘనంగా జరిగింది.
స్వామివారు కొలువు తీరిన రధం ఈ ఊరేగింపులో తరలిరాగా, భక్తులు స్వామివారిని సేవించి తరించారు. పలు నృత్య ప్రదర్శనలతో పాటు కేరళ కథాకళి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకర్షించింది. ఉభయగోదావరి జిల్లాల గోవింద మాల కమిటీ గురువులు యాదంరెడ్డి సత్యం, పరువు ప్రముఖులు, గోవింద మాల భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.