Telugu News Power

పేరు నమోదుకు ఆఖరి అవకాశం

కమిషనర్ పార్థసారథి

పాలకొల్లు: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, పేరు నమోదుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి, 20 నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి, వారి పేరుతో జనన ధ్రువ పత్రం పొందటానికి గడువు, ఈ నెల 21తో ముగుస్తుంది. ఇప్పటికీ పేరు నమోదు చేసుకోని వారు స్థానిక మున్సిపల్ కార్యాలయం, జనన మరణ నమోదు కేంద్రం వద్ద వివరాలు అందించి, జనన ధ్రువపత్రం, పేరుతో సహా పొందవచ్చునని, కమిషనర్ పార్థసారధి ఒక ప్రకటనలో తెలిపారు.