అక్రమ మద్యం అమ్మకాలు, రవాణా, త్రాగడం వంటి చర్యలను ఉక్కుపాదంతో అనచివేస్తామని, పాలకొల్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ మద్దాల శ్రీనివాస్, గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇందుకు సంబంధించి గతంలో ముద్దాయిలు సుమారు 20 మందిని బైండోవర్ చేశామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి మద్యం తెచ్చి, అమ్మకాలు చేస్తే, నేరస్తులతో పాటు, ఆయా వాహనాలను కూడా సీజ్ చేస్తామన్నారు. పండుగ ప్రశాంతంగా, కల్తీ మద్యం బారిన పడకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు సిఐ శ్రీనివాస్ తెలిపారు.
అక్రమ మద్యంపై ఉక్కుపాదం -సిఐ మద్దాల శ్రీనివాస్.