భీమవరం: జనవరి,27(తెలుగు న్యూస్ పవర్) ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓల వల్ల మేలు జరుగుతుందని, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ తెలిపారు. ఇంతవరకు, ప్రమోషన్ వద్దనుకున్న ఉపాధ్యాయులకు, భవిష్యత్తులో ప్రమోషన్ పొందే అర్హత కోల్పోయేవారు. కొత్త జిఓ, ఏపీ ఎస్ ఎస్ ఆర్-1996,28 నిబంధనకు సావరణ చేస్తూ జీవో ఇచ్చారు. ఇప్పుడు ఉపాధ్యాయులు, ప్రమోషన్ కావాలనుకుంటే, ఎప్పుడైనా పొందవచ్చు.
మెగా డీఎస్సీ ఉపాధ్యాయులకు, సర్విస్ కొనసాగింపు.
గతంలో, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పై పోస్టుకు ఎంపికైనప్పుడు, వారు ఇంతవరకు చేసిన పోస్ట్ కు సంబంధించి, జీతం, సేవా కాలం పరిగణలోకి తీసుకునేవారు కాదు. ఇప్పుడు ఎఫ్ ఆర్ 22(ఎ)(iv) ప్రకారం, పే ప్రొటెక్షన్ వర్తింప చేశారు. గతంలో పనిచేసిన ఉద్యోగం ద్వారా తీసుకున్న జీతం కంటే, తగ్గకుండా పే ఫిక్సేషన్ చేస్తారు. పూర్వ సేవా కాలాన్ని పరిగణలోకి తీసుకుని, సర్వీస్ కొనసాగిస్తారు. ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా జిఓలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.