Telugu News Power

మిర్చి యార్డ్ ఉపాధ్యక్షురాలిగా జనసేన వీర మహిళ.

గుంటూరు మిర్చి యార్డ్ ఉపాధ్యక్షురాలు మల్లి క

గుంటూరు: ఫిబ్రవరి, 6 (తెలుగు న్యూస్ పవర్) ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైన గుంటూరు మిర్చి యార్డు, ఉపాధ్యక్ష పదవికి, బిట్రగుంట మల్లిక ఎంపికయ్యారు. గతంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్, జనసేన పార్టీలో అనేక పార్టీ పదవులలో పనిచేశారు. గుంటూరులో కార్పొరేటర్ గా జనసేన తరఫున పోటీ చేశారు. వీరి ఎంపిక పట్ల జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. పలువురు జనసేన నాయకులు మల్లికను అభినందించారు.