Telugu News Power

ఛాంబర్స్ కళాశాలలో రక్తదాన శిబిరం

రక్తదానం చేస్తున్న చాంబర్స్ కాలేజీ విద్యార్థిని

ఛాంబర్స్ కళాశాలలో రక్తదాన శిబిరం

పాలకొల్లు: ఫిబ్రవరి, 10(తెలుగు న్యూస్ పవర్)

స్థానిక బి ఆర్ ఆర్ & జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రాంగణంలో మంగళవారం, ది పాలకొల్లు బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ శ్రీ కె.వి.ఆర్ నరసింహారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ, ఈ సృష్టిలో కృత్రిమంగా దొరకనిది, ఆపద కాలంలో ప్రాణాన్ని రక్షించేది రక్తమేనని, అందరూ రక్తదానాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించాలని ఆయన
కోరారు. అందుకే కళాశాలలో విద్యార్థులకు సేవా తత్పరతను అలవర్చేందుకు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్
డి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, యువత ఇటువంటి సేవా కార్యక్రమాలలో భాగస్వాములగుట ద్వారా సమాజం పట్ల అవగాహన పెరిగి అత్యుత్తమ పౌరులుగా తయారవుతారని, రక్తదానం చేయడం ద్వారా యువత ఆరోగ్యంగా ఉంటారన్నారు. రక్తదాన శిబిరాలలో పాల్గొని ఆదర్శప్రాయంగానిలుస్తున్నారని, ఈ రక్తదాన శిబిర కార్యక్రమం లయన్ సత్యనారాయణ పరిశీలనలో నిర్వహించారు.ఈ శిబిరం లో 32 మంది విద్యార్థులు రక్తదానం చేసారు.
ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ శ్రీ కె.వి సీతారామరాజు , ట్రెజరర్ ఆర్ ప్రవీణ్ భాను, అకాడమిక్ అడ్వైజర్స్ డాక్టర్ ఎబిఎస్ మూర్తి , నందుల సీతారామరావు , లయన్ జయప్రకాష్ నారాయణ , పాలకొల్లు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఎన్ఎస్ఎస్ అధికారులు రాంబాబు, రాధా మాధవి, ఉన్నత భారత అభియాన్ కోఆర్డినేటర్ ఉషశ్రీ , అంజలీ, ఎన్. రవికుమార్, జానకిరామయ్య, వర్మ , విజయ్ కుమార్, పవన్ కుమార్, నారాయణ , అంజలి, శైలజ నరసింహంబ తదితరులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.