పాలకొల్లు; ఫిబ్రవరి,12(తెలుగు న్యూస్ పవర్)
బిజెపి పాలకొల్లు పట్టణ శాఖ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు, ఎస్ టి పి రఘు రామానుజాచార్యులు ఆకస్మిక మృతికి ఘన నివాళి అర్పించారు. చిత్రపటం వద్ద పాలకొల్లు పట్టణ శాఖ అధ్యక్షులు కొల్లి కొండా ప్రసాద్, బిజెపి రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్ ఉన్మట్ల కబర్ధి, బిజెపి సీనియర్ నాయకులు రైల్వే మెంబర్ జక్కంపూడి కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి చెరుకూరి శ్రీనివాస రావు, బోడా కనకరాజు, నాళం బాబి, వేరుకొండ దుర్గా ప్రసాద్, బొక్కా నరసింహమూర్తి, వినుకొండ శేషాద్రి, కీర్తి చంద్, దుడే హరనాథ్, పడవల ఉమా శ్రీనివాస్, బెల్లంకొండ నరసింహారావు, కోరాడ సూరిబాబు, పీతాని సత్యనారాయణ తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.
రఘు బాబుకు ఘన నివాళి
రఘు బాబుకు నివాళులర్పిస్తున్న బిజెపి నాయకులు