యలమంచిలి: మార్చి, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక చించినాడ బ్రిడ్జి బేరింగ్ రీప్లేస్మెంట్ పనులకు గాను రెండు వారాలపాటు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు బంద్ అవుతాయి.ఈనెల 12, 15, 18, 21, 24, 27, 30 తేదీల్లోను, వచ్చేనెల 2, 5, 8, 11, 16, 21, 26 తేదీలలో కూడా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాలు రాకపోకలు నిలిపివేస్తారు. ఈ బ్రిడ్జిపై రాకపోకలు సాగించేవారు ఈ మార్పులకు అనుగుణంగా ప్రయాణ సమయాలు మార్చుకోవాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు
చించినాడ వంతెన పై రాకపోకల సమయాలు నియంత్రణ.
జాతీయ రహదారి 216 ను కలుపుతున్న చించినాడ-దిండి విశిష్ట వంతెన