Telugu News Power

టిడిపి విశ్వాసులకు పురస్కారం.

గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు
టీ.సులేమాన్ రాజ్

పాలకొల్లు/తాడేపల్లిగూడెం: మార్చి, 28(తెలుగు న్యూస్ పవర్.కామ్) తెలుగుదేశం పార్టీని 44 ఏళ్లు గా వెన్నంటి ఉన్న పార్టీ విశ్వాసపాత్రులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున, ఆదివారం, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఘనంగా సత్కరించనున్నారు. పోడూరు మండలం, కొమ్ముచిక్కాల కు చెందిన, గొట్టుముక్కలు సూర్యనారాయణ రాజు, తాడేపల్లిగూడెం మండలం, పడాల మాజీ సర్పంచ్, తన్నీడి సులేమాన్ రాజు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 29 మందికి ప్రతిష్టాత్మకమైన ఈ గౌరవం దక్కనుంది. రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, సూర్యనారాయణ రాజు పేరును, వారు పార్టీకి చేసిన సేవలు ప్రాతిపదికన, ప్రతిపాదించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ వలవల బాబ్జి సులేమాన్ రాజు పేరు ప్రతిపాదించారు.