Telugu News Power

మంత్రి శ్రమదానం.

పాలకొల్లు: మార్చ్; 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) అభివృద్ధి పనుల వారం వారం పరిశీలనా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు స్థానిక 27వ వార్డు క్రైస్తవ స్మశాన వాటిక పనులు పరిశీలించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయిన ఆదివారం స్లాబ్ పనులు నిర్మాణంలో శ్రమదానం చేశారు. అక్కడే అల్పాహారం తీసుకున్నారు. పలు జరుగుతున్న తీరు పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోనూరు స్థానిక నాయకులు పాల్గొన్నారు.