Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో చండీ హోమం.

చెండీహోమం

భీమవరం: జూన్, 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం లో సోమవారం అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు, వేదపండితులు చండీహోమం కార్యక్రమం నిర్వహించారు. హోమ కార్యక్రమములో 89 మంది దంపతులు పాల్గొన్నారు.ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు వుదీశి మీనాక్షి, గుసిడి నాగ శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, గొంతిన రమణ, యండ సత్యవతి, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పాల్గొన్నారు