Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మకు 4 గ్రాముల బంగారం కానుక.

శ్రీ మావమ్మ చిత్రపటం అందుకుంటున్న దాత జయలక్ష్మి

భీమవరం: జూలై,16( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి భీమవరం కి చెందిన భీమనాధం భాస్కరరావు జ్ఞాపకార్థం వారి భార్య జయలక్ష్మి నాలుగు గ్రాముల బంగారం విరాళంగా అందజేశారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,అతికెల్ ఆంజనేయ ప్రసాద్ చిత్రపటం ప్రసాదం అందజేసారు.