Telugu News Power

Blog

వజ్ర సంకల్పం ముందు వైకల్యం ఓటమి

పాలకొల్లు:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) వైకల్యాన్ని ఎదిరించి నిలిచిన నిలువెత్తు స్ఫూర్తి వేదాంతం సదాశివమూర్తి. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలానికి చెందిన, ప్రస్తుతం పాలకొల్లులో స్థిరపడ్డ వీరి జీవితం దివ్యాంగులకు ఓ ఆచరణీయ మార్గదర్శి. రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లు మోకాలు వరకు తొలగించవలసి వచ్చింది. తీవ్రమైన శారీరిక బాధను మానసిక వేదనను తట్టుకుని నిలబడిన మేరు పర్వతం సదాశివమూర్తి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పట్టా పొంది, ద్విచక్ర వాహనాలు, ముఖ్యంగా బుల్లెట్ వాహనాలను ఎంత…

Read More

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం.

పాలకొల్లు:డిసెంబర్,3(తెలుగు న్యూస్ పవర్) ప్రతి ఏటా డిసెంబర్ 3 న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి 1992లో ఈరోజు దివ్యాంగుల కోసం అధికారికంగా ప్రకటించింది. అప్పటినుంచి ప్రపంచ దేశాలన్నీ ఈ సామాజిక బాధ్యత తీసుకుని ముందుకు నడుస్తున్నాయి. వికలాంగులను వేరుగా చూడకుండా, వారు కూడా మనలో ఒకరిగా చూడాలని ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. దివ్యాంగులు అంటే అంటే సమాజం చిన్న చూపు చూస్తుంది. అయితే ఆ భావన నిరాధారమైనది. సమాజంలో వీరిని అసహజం,అసమర్థులుగా…

Read More

ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు

యమంచిలి:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని అడవిపాలెం గ్రామంలో అద్దెపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థుల,ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీపీ పాఠశాల వద్ద విద్యార్థులకు సాంస్కృతిగా పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, ప్రతిభ మెరుగుపరుచుకోవచ్చు అన్నారు. ఎన్ఎస్ఎస్ క్యాంపులో సేవాభావంతో పాల్గొన్న విద్యార్థులను ప్రిన్సిపల్…

Read More

వైసీపీ నేతలకు సిఐడి నోటీసులు

యలమంచిలి:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి మండలం వైసిపి అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు మంగళవారం సిఐడి నోటీసులు అందుకున్నట్టు వెల్లడించారు. టిడ్కో ఇల్లు పంపిణీ సభ సందర్భంగా, 2022 లో జరిగిన ఘర్షణకు సంబంధించి ఈ నోటీసులు అందుకున్నామన్నారు. అప్పటి శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ప్రోటోకాల్ పాటించకపోవడం,తనపై దాడి చేశారని పలువురు వైసిపి నాయకులు పై కేసు పెట్టారని తెలిపారు. ఇది తనపై టిడిపి పార్టీ వారు పెట్టిన ఐదో కేసుగా ఆయన వివరించారు. వైసిపి…

Read More

యుటిఎఫ్ టెస్ట్ పేపర్ల పంపిణీ

యమంచిలి:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్) విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతిలో మంచి మార్కులు తో పాస్ కావాలని యలమంచిలి మండల పరిషత్ అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి కోరారు. యుటిఎఫ్ ఉచితంగా పంపిణీ చేస్తున్న టెస్ట్ పేపర్ల వితరణ కార్యక్రమంలో భాగంగా ఏనుగులంక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వీరి సౌజన్యంతో ఇస్తున్న పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు…

Read More

అడవిపాలెం లో క్లీన్ అండ్ గ్రీన్

యమంచిలి:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో, పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్న సందర్భంగా మంగళవారం మండల పరిషత్ పాఠశాల, గాంధీ నగర్ పరిసర ప్రాంతాల్లో వాలంటీర్లు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. తదుపరి మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తరచూ మోసాలకు గురవుతున్న గ్రామస్తులను సైబర్ నేరాల బారిన పడకుండా రక్షించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. మీ శిబిరంలో ఎన్ఎస్ఎస్ కమిటీ…

Read More

మహిళ అనుమానస్పద మృతి

పాలకొల్లు:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్)స్థానిక పెంకుళ్ళపాడు సమీపంలో ఉన్న టిట్కో, ఎల్. అండ్ టి. కాలనీ వద్ద ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మృతురాలు పేరు తాడి రాధా(30) గా గుర్తించారు. ఈమె పదేళ్ళు గా భర్తకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. సుధాకర్ అనే వ్యక్తితో ఈమె గత ఏడేళ్లుగా సహజీవనం సాగిస్తున్నట్టు వెల్లడించారు. ఈ జంట మంగళవారం తెల్లవారుజామున గొడవ పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం…

Read More

యలమంచిలిలో తొలి ట్రస్ట్ ఏర్పాటు

యలమంచిలి:డిసెంబర్,2(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలికి మొట్టమొదటిసారిగా శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఒక ట్రస్ట్ రాబోతుంది. యలమంచిలి అభివృద్ధికి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, పేదల సంక్షేమానికి ఎప్పటినుంచో పాటుపడుతున్న తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నట్టు వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. ఈ మేరకు సింహాచల అప్పన్న, క్షేత్ర వరాహ నరసింహస్వామి వారి దేవాలయంలో పూజలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ ట్రస్ట్ కు సుకృత గా నామకరణం చేశారు. చిహ్నాన్ని విడుదల చేశారు….

Read More

పాలకొల్లు సుబ్బారాయుడు గుడి వద్ద అఖండ అన్న సమారాధన

పాలకొల్లు:డిసెంబర్,2 (తెలుగున్యూస్ పవర్) స్థానిక సుబ్బారాయుడు గుడి సెంటర్లో వేయించేసి ఉన్న, శ్రీవల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి ఉత్సవాల సందర్భంగా మంగళవారం అఖండ అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. వర్షం వల్ల ప్రతికూల పరిస్థితి ఉన్నా నిర్వాహకులు అనేక ప్రయాసలతో భక్తులకు ఏ లోటు రాకుండా అన్నదాన కార్యక్రమం సజావుగా జరిపించారు. మహిళలకు టేబుల్ మీల్స్ ఏర్పాటు చేశారు. పురుషులకు బఫే భోజనం అందించారు. వర్షంలో కూడా కొందరు భక్తులు గొడుగులు సహా వచ్చి అన్న…

Read More

క్షీరారామ అన్నదాన కమిటీ జమా ఖర్చుల సమావేశం.

పాలకొల్లు: డిసెంబర్,1 (తెలుగు న్యూస్ పవర్) కార్తీక మాసం సందర్భంగా స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన నెల రోజుల నిత్యాన దాన కమిటీ సమావేశం లీలా కళ్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అన్నదాన కార్యక్రమం కోసం నిరంతరం శ్రమించిన పలువురు స్వచ్ఛంద సేవకులను సత్కరించారు. ఈ సందర్భంగా అక్టోబర్, 22 నుంచి నవంబర్, 20…

Read More