Telugu News Power

క్షీరారామంలో చండీయాగం

పాలకొల్లు: నవంబర్,23 (తెలుగు న్యూస్ పవర్) క్షీరా రామలింగేశ్వర స్వామి వారి యాగశాలలో ఆదివారం చండీ హోమం జరిగింది. ఆడిటర్ రామరాజువారి కుమారులు బలరామరాజు దంపతులచే ఈ హోమం భక్తిశ్రద్ధలతో పురోహితులు సూరిబాబు ఆధ్వర్యంలో జరిపించారు. పలురువు భక్తులు ఈ హోమాన్ని వీక్షించారు.

Read More

మెడికల్ కాలేజీల పి పి పి విధానంపై చర్చకు రావాలి- జడ శ్రవణ్ కుమార్ సవాల్

పాలకొల్లు: నవంబర్, 23 (తెలుగు న్యూస్ పవర్) కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పి పి పి విధానం లో వైద్య కళాశాల ఏర్పాటు ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తుందో ప్రజలకు వెల్లడించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని మాజీ న్యాయమూర్తి, జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో రాబోయే 17 వైద్య కళాశాలలు పి పి పి పద్ధతిలో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాల పరిరక్షణ…

Read More

భావిత తరాల కోసం నిరంతరం కష్టపడాలి మంత్రి నిమ్మల పిలుపు

యలమంచిలి: నవంబర్,23 (తెలుగు న్యూస్ పవర్) భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మంత్రి మిమ్మల్ని రామానాయుడు పిలుపునిచ్చారు. యలమంచిలి మండల కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యలమంచిలిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఈ సభకు నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి చిన్ని స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో ఉండి రాజకీయం కూడా చేయాలని కోరారు. మళ్లీ జగన్ అధికారంలోకి…

Read More

జగన్ నీటి లేఖపై నిప్పులు చెరిగిన- మంత్రి నిమ్మల

పాలకొల్లు:నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) కృష్ణా నది జలాల వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ -2 ముందు వాదనలు వినిపించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ పై మంత్రి నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లో శనివారం సాయంత్రం రాష్ట్ర జలవి వనరులశాఖమాత్యులు నిమ్మల రామానాయుడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. జగన్ ఆంధ్రరాష్ట్ర జలవనరులను తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. మాజీ…

Read More

జిల్లా విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

పాలకొల్లు నవంబర్ 22 తెలుగు న్యూస్ పవర్ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ శనివారం పాలకొల్లు బ్రాడీపేట లో గల ఎంపీజే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు.వారికి అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మండల విద్యాశాఖ అధికారులు గుమ్మల్ల వీరాస్వామి, ఆర్ వి ఎస్ గంగాధర శర్మ పాల్గొన్నారు.

Read More

త్వరలో టిడ్కో ఇళ్ళ గృహప్రవేశాలు – మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) పేదలు, మహిళలు ఎప్పుడా,ఎప్పుడా అని ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల గృహప్రవేశం కోసం ఇక తన దృష్టి కేంద్రీకరించి పనిచేస్తానని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యుల నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో శనివారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కోట్లాది రూపాయలు నిధులతో పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రగతినీ మంత్రి స్వయంగా ద్విచక్ర వాహనంపై، కూటమి నాయకులతో…

Read More

విజిలెన్స్ అధికారులు తనిఖీ

పాలకొల్లు:నవంబర్,21 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు మున్సిపాలిటీ పరిధిలో గల బంగారు చెరువు గట్టు పనులను విజిలెన్స్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ నిధులనుండి వాకింగ్ ట్రాక్, పార్క్ నిర్మాణం కోసం పనులు గతంలో చేపట్టారు. అయితే న్యాయ సమస్యల వల్ల ఆ పనులు నిలిపివేయవలసి వచ్చినట్లు తెలిసింది. అప్పటి నుంచి పనులు ముందుకు సాగటం లేదు. దీనిపై విజిలెన్స్ అధికారులు పనులకు సంబంధించి వివరాలు అధికారుల నుంచి సేకరించారు. పనుల తీరు, నాణ్యత కొలతలతో…

Read More

దేశంలో మొదటిసారి మత్స్యకారుల ప్రగతి కోసం

దేశంలో మొదటిసారి మత్స్యకారుల ప్రగతి కోసం ఒక క్యాబినెట్ మంత్రితో, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన తొలి ప్రధానమంత్రి మోడీని తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నరసాపురం మిషన్ హై స్కూల్ రోడ్డులో, భారీ స్థాయిలో ఏర్పాటు అయిన సభలో కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అధ్యక్షత వహించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం,…

Read More

ప్రజల రుణం తీర్చుకునె వరకు విశ్రాంతి లేదు – మంత్రి నిమ్మల

తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునే వరకు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నానని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. టిడిపి అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జరిగిన సభలో మంత్రి శుక్రవారం రాత్రి మాట్లాడారు. పాలకొల్లు లో భారీ బైక్ ర్యాలీ, మంత్రి స్వయంగా పాల్గొని,పురవీధుల్లో ఉత్సాహంగా పర్యటించారు. ఈ సందర్భంగా కిక్కిరిసిన పార్టీ అభిమానులు కార్యకర్తలునాయకులతో లయన్స్ కమ్యూనిటీ హాల్ జరిగింది సభలో మంత్రి ఉద్వేగంగా మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి పథంలో, సంక్షేమ దిశలో…

Read More

గంగడుపాలెం వైయస్సార్ సిపి నాయకుల పర్యటన

యలమంచిలి, నవంబర్ 21 (తెలుగు న్యూస్ పవర్) కూటమి ప్రభుత్వం పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ వైయస్సార్ సిపి పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం లో భాగంగా పలువురు వైఎస్ఆర్ సీపీ నాయకులు గురువారం రాత్రి పర్యటించారు. పి పిపి విధానం వల్ల పేద,మధ్యతరగతి వారి పిల్లలకు వైద్య విద్య చదవలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం తెస్తుందని పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల గోపి రచ్చబండ కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాల…

Read More