Telugu News Power

సి ఎస్ ఆర్ నిధులు పర్యావరణ పరిరక్షణకు కేటాయించాలి. -ఎంపీ పాక సత్యనారాయణ

న్యూఢిల్లీ: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కాం) పరిశ్రమలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను పర్యావరణ పరిరక్షణ కోసం కేటాయించాలని, రాజ్యసభ సభ్యులు, బిజెపి నాయకులు బాగా సత్యనారాయణ కోరారు. రాజ్యసభలో, గురువారం ఈ మేరకు సూచన చేశారు. కంపెనీల చట్టం, 2013 ప్రకారం తమ లాభాల్లో 2శాతం వాటా సిఎస్ఆర్ నిధులకు కేటాయించవలసి ఉందన్నారు. ఈ మొత్తం,2023-2024 లో రూ.34, 908 లు ఉందన్నారు. ఈ నిధులు పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య నివారణ, పర్యావరణ…

Read More

ఉత్తరాంధ్ర ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త.

న్యూఢిల్లీ: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖామాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎంతోకాలంగా చేసిన ప్రయత్నాల ఫలితంగా, శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణించే మూడు ముఖ్యమైన రైళ్లకు ఇప్పుడు కీలక స్టేషన్లలో రైల్వే శాఖ హల్ట్ లు మంజూరు చేశారు. గుణుపూర్–విశాఖపట్నం (58505/06)ప్యాసింజర్ రైలు ఇకపై హరిశ్చంద్రపురం వద్ద, (8525/26) బెరహంపూర్–విశాఖపట్నం (8525/26) ప్యాసింజర్ రైలు మందస…

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నియామకం.

అమరావతి: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నియామకం ఉత్తర్వులు గురువారం విడుదల చేశారు. కమిటీ చైర్మన్, వేటుకూరి ఏవీఎస్ఎస్ఎన్ రాజు, కాకినాడ, సభ్యులుగా, కె.వి వెంకట పద్మావతి,గుంటూరు, డాక్టర్ దోని శ్రీనివాసమూర్తి, శ్రీ సత్య సాయి జిల్లా, ఉండవల్లి గాంధీ బాబు, అల్లూరి సీతారామరాజు జిల్లా, చాలా మధుసూదన్ రావు, మంగళగిరి, మండల గంగ సూర్యనారాయణ, కాకినాడ జిల్లా, భావరాజు పద్మావతి, రాజమండ్రి నియమితులయ్యారు. వీరు పదవీకాలం మూడు…

Read More

నేటి నుంచే పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో 17వ జాతీయ స్థాయి నాటిక పోటీలు.

పాలకొల్లు: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) నేటి నుంచి ప్రారంభం కానున్న జాతీయస్థాయి నాటికోత్సవాలకు కళాభిమానులందరూ హాజరు కావలసిందిగా అధ్యక్షులు కెవి కృష్ణ వర్మ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధ నాటక బృందాలు పాల్గొనే అద్భుతమైన రంగస్థల నాటిక ప్రదర్శనలు జరుగుతాయని గురువారం తెలిపారు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను రూపుమాపి, ప్రజలను చైతన్యం చేయటానికి ఈ నాటికలు తోడ్పడతాయన్నారు. ఈ నాటక పరిషత్ నిర్వహణకు సహకరిస్తున్న కాష్మో క్లబ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, టౌన్ హాల్,…

Read More

చిన్న వయసు, పెద్ద మనసు

బొయసే: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) అమెరికాలోని, ఇదాహో రాజధాని నగరం బొయసే లో నివసించే 9 ఏళ్ల బెన్ మిల్లర్ వయసులో చిన్నవాడై తన పెద్ద మనసు చాటుకున్నాడు. .ఎక్కువ మంది పిల్లలు తాము దాచుకున్న డబ్బులు (లెమనేడ్ స్టాండ్‌తో సంపాదించిన డబ్బును) బొమ్మలు లేదా స్నాక్స్‌పై ఖర్చు చేస్తారు. కానీ మనం చెప్పుకోబోయే, బెన్ మిల్లర్‌కు మరో ఆలోచన వచ్చింది. అతని పెద్దమ్మతో ఇడహో హ్యూమేన్ సొసైటీకి వెళ్లిన తర్వాత, బెన్ ఒకటి…

Read More

ఢిల్లీకి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరణ్జిత్ సింగ్ సందు ప్రమాణ స్వీకారం

ఢిల్లీ: మార్చి, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత రాజధాని ఢిల్లీ 23వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరణ్జిత్ సింగ్ గురువారం,ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక లోక్ నివాస్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. Devendra Kumar Upadhyaya, Delhi High Court ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, ఆయన చేత పదవి మరియు గోప్యత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్త తో పాటు పలువురు ప్రముఖులు…

Read More

రైల్వే భద్రతకు ‘కవచ్’ పనులు వేగవంతం. -మంత్రి అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ: మార్చి,11(తెలుగు న్యూస్ పవర్. కాం) రైల్వే భద్రతకు సంబంధించి అతి ముఖ్యమైన ‘కవచ్’ పనుల పురోగతి గురించి రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు దగ్గుబాటి పురందరేశ్వరి లోక్సభలో బుధవారం ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి అశ్విని వైష్ణవ సమాధానం ఇస్తూ, కవచ్ అమలు చాలా క్లిష్టమైన వ్యవస్థ.దీనిలో భాగంగా ఇప్పటివరకు,8,570 కిమీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు, 1,100 టెలికాం టవర్లు నిర్మాణం, 767 స్టేషన్ డేటా సెంటర్లు ఏర్పాటు 6,776 కిమీ ట్రాక్‌సైడ్ పరికరాలు…

Read More

చించినాడ వంతెన పై రాకపోకల సమయాలు నియంత్రణ.

యలమంచిలి: మార్చి, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చించినాడ బ్రిడ్జి బేరింగ్ రీప్లేస్మెంట్ పనులకు గాను రెండు వారాలపాటు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు బంద్ అవుతాయి.ఈనెల 12, 15, 18, 21, 24, 27, 30 తేదీల్లోను, వచ్చేనెల 2, 5, 8, 11, 16, 21, 26 తేదీలలో కూడా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాలు…

Read More

సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్ర.

యలమంచిలి: మార్చి, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం పార్టీ నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర బుధవారం సాయంత్రం యలమంచిలి సెంటర్ కు చేరింది. ఈ యాత్రలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఈ యాత్ర 20 మండలాలు, ఆరు పట్టణాల్లో 650 కిలోమీటర్ల లో జరుగుతుంది. గత నెల 26న మొదలైన యాత్ర, ఈనెల 23న ముగుస్తుంది. ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్ళ సమస్యల పరిష్కారం, రక్షిత మంచినీరు, విద్య,…

Read More

జనసేన సభ్యత్వ నమోదు 17 వరకు పొడిగింపు.

మంగళగిరి: మార్చి,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 17 వరకు పొడిగించింది. ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందన రావడంతో ఈ నమోదు కార్యక్రమం పొడిగించాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ లోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు ఉద్యమి ద్వారా జరుగుతున్నది. స్థానిక జనసేన నాయకులు కోరిన మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం పొడిగించినట్లు పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…

Read More