Telugu News Power

యలమంచిలి మండలంలో మంత్రి నిమ్మల పర్యటన

పాలకొల్లు,యలమంచిలి: జనవరి,4(తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిర్మల రామానాయుడు, పాలకొల్లు, యలమంచిలి మండలాలలో ఆదివారం పర్యటించారు. పాలకొల్లు కమ్యూనిటీ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో అదనంగా మరో రెండు బెడ్లు ఏర్పాటు చేశారు. మంత్రి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తో కలిసి వీటిని ప్రారంభించారు. ఆగర్రు లో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందజేశారు. అనంతరం యలమంచిలి మండలంలో గుంపుర్రు వద్ద వల్లూరు మీడియం డ్రైన్ పై ఇన్ లెట్…

Read More

అమ్మవారికి భూరి విరాళం

యలమంచిలి: జనవరి, 4(తెలుగు న్యూస్ పవర్) స్థానిక కాపులపాలెం, కుళాయి చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి ఆదివారం పందిరి రాడు వేశారు. ఈ సందర్భంగా, తాళ్లూరి శ్రీనివాస్ (వైజాగ్ బుజ్జి) శిరీష దంపతులు అమ్మవారికి 4.59 లక్షల రూపాయల భూరి విరాళం సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చివటపు నాగేశ్వరరావు, కాసా సత్య, వీరబాబు,బొప్పన రాంబాబు, శనగల శ్రీనివాస్, కొడవటి శివరామకృష్ణ, ఆకుల యేసు, కాసా ఆంజనేయులు…

Read More

శ్రీవారి కళ్ళు ఎందుకు ఎరుపు

పాలకొల్లు: డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) శ్రీవారి కళ్ళు ఎందుకు ఎరుపు రంగులో ఉన్నాయని, శ్రీదేవి కనులు ఎందుకు నల్లగా ఉన్నాయ తెలుసుకుంటే, లక్ష్మీదేవి మేని చాయ ఎర్రని ఎరుపు రంగులో ఉండటం వల్ల, శ్రీవారు, శ్రీదేవిని తదేకంగా చూస్తూ ఉండటం వల్ల, ఆ ఎరుపు శ్రీవారి కళ్ళల్లో ప్రతిబింబిస్తుందని, శ్రీదేవి, స్వామి వారు నీల మేఘశ్యాముడు కావడం వల్ల, ఎల్లప్పుడు ఆ స్వామివారి వీక్షించడం అమ్మవారి పద్మ పత్ర దళ నేత్రాలు నలుపుగా మారాయని, శ్రీదేవి,శ్రీవారి…

Read More

కళ్యాణోత్సవ తొలి సమావేశం

పాలకొల్లు, జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) పార్వతీ సమేత క్షీరరామలింగేశ్వర స్వామి వారు, శ్రీ లక్ష్మీ సమేత జనార్ధన స్వామివార్ల కళ్యాణోత్సవ ఏర్పాట్లపై, గురువారం తొలి సమావేశం,అభిషేక మండపంలో జరిగింది. వచ్చే మార్చి ,27న నుంచి ఈ కల్యాణ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వీటిపై తొలి సమావేశం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, పాల్గొన్నారు.

Read More

నంది వాహనంపై గ్రామోత్సవం

పాలకొల్లు: డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) పవిత్ర ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామోత్సవం జరిగింది. నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరులు, గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత జనార్ధన స్వామి గ్రామోత్సవం సాయంత్రం మేళతాళాల, సంగీత వాయిద్యాలతో ఘనంగా జరిగింది. విగ్నేశ్వర పూజ స్థానిక క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో మంగళవారం, ఏడు వారాల, మారేడు దళాల ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులకు విఘ్నేశ్వర స్వామి…

Read More

వైభవంగా వైకుంఠ ఏకాదశి

పాలకొల్లు, యలమంచిలి, డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణ ఆలయాలు మంగళవారం ఉదయం నుంచి భక్తుల సందర్శనలతో కిక్కిరిసిపోయాయి. పాలకొల్లు శివాలయం జగన్ అన్నది జగన్నాధుని ఉపాలయాన్ని, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి భక్తులు విశేషంగా తరలించారు. స్థానిక ఎడ్ల బజార్లో వేంచేసి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నామము నా బొంతును రామ బంటును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా,ఇక్కడ ప్రసాద వితరణ, విశాఖపట్నంకు చెందిన…

Read More

నేడే ముక్కోటి ఏకాదశి

యలమంచిలి: డిసెంబర్, 29 (తెలుగు న్యూస్ పవర్) ముక్కోటి ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా ధనుర్మాసం (మార్గశిర మాసం) లో వచ్చే ఏకాదశి. ముక్కోటి అనే పదానికి అర్థం ముక్కోటి అంటే మూడు కోట్లు దేవతలు. ఈ రోజున మూడు కోట్లు దేవతలు శ్రీమహావిష్ణువును దర్శించుకుంటారని పురాణ విశ్వాసం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యం ఈ రోజున వైకుంఠ ద్వారం తెరవబడుతుందని నమ్మకం. భక్తులు…

Read More

వాడపల్లి, ఏడువారాల వెంకన్న సేవకు ధర్మకర్తల మండలి నియామకం.

ఆత్రేయపురం:డిసెంబర్,29(తెలుగు న్యూస్ పవర్) రెండవ తిరుపతిగా పిలువబడుతున్న, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం సోమవారం, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాలకొల్లుకు చెందిన పలువురు కూటమి నాయకులు తరలి వెళ్లారు. 1.ముదునూరివెంకటరాజు-అధ్యక్షులు 2. పెండ్యాల భవాని-పాలకొల్లు 3. చలుమూరి రాంబాబు-ఆచంట 4. ఏపుగంటి విజయ కుమారి-వాడపల్లి 5. సి. సూర్య కుటుంబరావు-ఆత్రేయపురం 6. తమ్మన…

Read More

స్వామి వారిని దర్శించుకున్న జిల్లా అటవీ శాఖ అధికారి

పాలకొల్లు:డిసెంబర్,26 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరారామలింగేశ్వర స్వామిని శుక్రవారం జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ సురేష్ కుమార్ దంపతులు దర్శించి,పూజలు చేశారు. కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో, శేష వస్త్రం బహుకరించి సత్కరించారు. ఆలయ పర్యవేక్షకులు పి వాసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

వరంగల్ జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి 35 కోట్ల నిధులు

తిరుపతి: డిసెంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి, తిరుమల తిరుపతి దేవస్థానం 35.19 కోట్ల నిధులు మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేంచేసి ఉన్న, కొండగట్టు అంజన్నగా పిలుచుకునే ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేస్తారు. జనసేన అధినేత,ఉపముఖ్యమంత్రి, కొణిదల పవన్ కళ్యాణ్ ఇష్టదైవాల్లో ఒకరైన అంజన్నకు గతంలో ఈ హామీ ఇచ్చినట్టు స్థానికులు తెలిపారు. ఆ మేరకు టీటీడీ ఈ నిర్ణయం ప్రకటించింది….

Read More