Skip to main content

Telugu News Power

గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి పోటీలు

పాలకొల్లు డిసెంబర్ 17 తెలుగు న్యూస్ పవర్ ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, గణిత పోటీల్లో పాల్గొనడం సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యం అలవాడతాయన్నారు. గణిత జ్ఞానం అందరికీ ఎంతో అవసరం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణిత సుడోకో, మ్యాజిక్ స్క్వేర్ అనే అంశం మీద పజిల్స్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణిత శాస్త్ర విభాగం అధ్యాపకులు కే శివకృష్ణ, రామలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు.