పాలకొల్లు: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో సోమవారం పౌర్ణమి సందర్భంగా, కళ్యాణ మండపంలో చండీ హోమం జరిగింది. పూజలు,హోమములు 23 మంది పుణ్యదంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అభిషేక పండితులు బమిడి పాటి వెంకన్న భక్తులు తరఫున పూజలు జరిపించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి కిష్టప్ప గారు సూపరింటెండెంట్ వాసు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
పంచారామంలో చండీ హోమం.
చండీ హోమం లో పాల్గొన్న భక్తులు