భీమవరం: ఆగస్టు, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి పాలకొల్లునియోజకవర్గం, యలమంచిలి లంక గ్రామానికి చెందిన త్సవటపల్లి శ్రీనివాస్ రావు, పద్మ దంపతులు 55వేల రూపాయిలు విరాళంగా అందజేసారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం శేషవస్త్రం ఆలయ ధర్మకర్తలు కారెంపూడి ఆదిలక్ష్మి,పాపొలు ఏడుకొండలు ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేసారని బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆదివారం తెలిపారు.
శ్రీ మావుళ్ళమ్మకు రూ.55 విరాళం ఇచ్చిన యలమంచిలి లంక దంపతులు.
అమ్మవారి చిత్రపటం స్వీకరిస్తున్న దాత దంపతులు