Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మకు 4 గ్రాముల బంగారం కానుకగా సమర్పణ.

దాతలకు అమ్మవారి చిత్రపటం బహుకరిస్తున్న కమిటీ సభ్యులు

భీమవరం: జులై, 4( తెలుగు న్యూస్ పవర్.కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు,ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణనిధికి కి జీవీ రజిని, టి ఎస్ ఆర్ లక్ష్మి, భీమవరం వారు 4 గ్రాముల బంగారం విరాళంగా అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆశీర్వచనపూజలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్త రామాయణం శ్రీనివాస్, సంపూర్ణ స్వర్ణమయ కమిటీ సభ్యులు గోంట్ల వెంకట నారాయణ, అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేసారు.