భీమవరం: జూలై,9( తెలుగు మూవీస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వెంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పుఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని కేరళ రాష్ట్ర డి జి పి, రావాడ ఆజాద్ చంద్ర శేఖర్, సరిత దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు, ఆశీర్వచనాలునిర్వహించారు.
ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, వుదీశి మీనాక్షి వీరికి శేషవస్త్రం ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందచేసినారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
శ్రీ మావుళ్ళమ్మను దర్శించుకున్న కేరళ డిజిపి దంపతులు.
అమ్మవారి చిత్రపటం స్వీకరిస్తున్న కేరళ డిజిపి దంపతులు