Skip to main content

Telugu News Power

భక్తులు అప్రమత్తంగా ఉండాలి. -నిర్వాహకుల విజ్ఞప్తి.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు అప్రమత్తతో ఉండాలని, తాళ్ళురి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి విజ్ఞప్తి చేశారు. శిఖరంపై పూజాలు నిర్వహించడానికి తాత్కాలికంగా మెట్లు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ఒకేసారి భక్తులు ఆ మెట్లపై నిలబడడం వల్ల బలం సరిపోక మెట్లు పడిపోయే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అది అమ్మవారికి, గ్రామానికి మంచిది కాదని తెలుసుకొని, భక్తులు…

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి, రెండో రోజు కుంకుమ పూజ, క్షీరాభిషేకం.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా, గురువారం కుంకుమ పూజ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహాలు, శిఖరాలతో గ్రామ ప్రదక్షణ జరిగింది. విగ్రహాలకు భక్తులు పాలు,పూలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ జలాధివాసం కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గవ్యాంతమార్జన, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తుబలి, పర్యగ్నికరణం,…

Read More

ఏటిగట్టు పనులతో ప్రమాదం -పాలకొల్లు వైసీపీ ఇన్చార్జ్ గుడాల గోపి ఆరోపణ

యలమంచిలి: ఫిబ్రవరి,18 (తెలుగు న్యూస్ పవర్) స్థానికంగా జరుగుతున్న ఏటిగట్టు పనులు ప్రమాదాన్ని తెచ్చి పెట్టేలా ఉన్నాయని పాలకొల్లు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి ఆరోపించారు. ఏటిగట్టు పక్కనే ఉన్న మట్టి తవ్వి, పైకి వేయడం వల్ల వరదలు వచ్చినప్పుడు ఆ గట్టు బలం లేక కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏటిగట్టు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని గోపి బుధవారం పరిశీలించారు. ఏటిగట్టు పనులు స్థానిక శాసనసభ్యులు…

Read More

సుప్రీంకోర్టు తీర్పు, నర్సాపురానికి బంగారు భవిష్యత్తు – ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ.

నర్సాపురం: ఫిబ్రవరి,18(తెలుగు న్యూస్ పవర్) గౌరవ భారత అత్యున్నత న్యాయస్థానం ప్రకటించిన తీర్పు,నరసాపురం ప్రాంత అభివృద్ధికి బంగారు బాటలు వేస్తుందని, స్థానిక లోక్సభ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రంలో, స్థానిక జనసేన ఎమ్మెల్యే, విప్ బొమ్మిడి నాయకర్ తో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. చించినాడ- దిండి, వశిష్ట వారధికి ఇరువైపులా ఉన్న జాతీయ రహదారి 216, విస్తరణ సంబంధించి భూసేకరణ విషయంలో, భూస్వాములు న్యాయం కోరుతూ,…

Read More

ప్రతి ఇంటికి పాడిపశువు ఉండాలి – కలెక్టర్ నాగరాణి

పాలకొల్లు: ఫిబ్రవరి, 18(తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలం, అగర్తిపాలెంలో పశుసంవర్ధక శాఖ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సంయుక్తంగా నిర్వహించిన మెగా పశు వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం ప్రారంభించారు. గోమాతకు పూజలు చేసి శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్, గర్భకోశ శస్త్రచికిత్స, నట్టల నివారణ, గోమార్ల నివారణ, ఉచిత మందులు, ల్యాబ్ పరీక్షలను స్వయంగా పరిశీలించారు. రైతుల సమావేశంలో మాట్లాడుతూ,స్వచ్ఛమైన పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, కల్తీ పాల వల్ల ప్రమాదాలు…

Read More

కత్తి పట్టిన క్షత్రియులు.

పాలకొల్లు: ఫిబ్రవరి,18(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో, ఆఖరి మజిలీ చేసే స్మశాన ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి సంకల్పించినట్టు, పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు, గాంధీ మెగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పేర్కొన్నారు. స్థానిక పూలపల్లి, రాజుల స్మశాన వాటిక ప్రాంతాన్ని భగవాన్ రాజు ఆధ్వర్యంలో పలువురు క్షత్రియులు కత్తి పట్టి శ్రమదానం చేసారు.అడవిలా…

Read More

నర్సాపురం వద్ద వంతెన నిర్మించాలి. -కాంగ్రెస్ పార్టీ డిమాండ్

నరసాపురం: ఫిబ్రవరి, 18 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక వశిష్ట గోదావరిపై వెంటనే వంతెన నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. జిల్లా బీసీ నాయకులు,కొలకలూరి అర్జునరావు ఆధ్వర్యంలో బుధవారం, వాళ్ళందర్ రేవులో అర్జున్ రావు మాట్లాడుతూ, 2004 నుంచి చాలా ప్రభుత్వాలు మారినప్పటికి, ఇప్పటికీ బ్రిడ్జి నిర్మించకపోవడం పట్ల నిరసన తెలిపారు. సముద్రంలో కూడా బ్రిడ్జిలు కడుతున్న నేటి అభివృద్ధి చెందిన సాంకేతిక నైపుణ్యంతో, నర్సాపురం వంటి చిన్ని గోదావరి నిర్మించలేకపోవటం, ప్రజల్ని మభ్యపెట్టడమేనన్నారు. తాము…

Read More

శ్రీశ్రీ శ్రీ మూలస్తానేశ్వరి, వైభవంగా నూతన ఆలయ ప్రవేశ ప్రారంభోత్సవం.

యలమంచిలిని చల్లగా చూసే తల్లి, శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి బింబ,యంత్ర శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మశ్రీ కాళ్ళకూరి దుర్గాప్రసాద్ శర్మ ఆచార్యతంలో,బ్రహ్మశ్రీ యలమంచిలి నరేంద్ర శర్మ బ్రహ్మత్వంలో ఈ ప్రతిష్టా కార్యక్రమం బుధవారం, వేదపఠం ఘోషతో వైభవంగా ప్రారంభమైంది. గణపతి ప్రార్థన, మంగళ వాయిద్యలతో ఆలయ, యాగశాల ప్రదక్షణం చేశారు. భూతబలి, విగ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ఆరాధన, ప్రోక్షనలు, ప్రాశనలు, ఋత్విక్ వరుణలు, దీక్షాధారణ, అఖండ జ్యోతి ప్రజ్వలన,…

Read More

ప్రణవి, మెయిన్స్ లో అద్భుత ప్రతిభ.

యలమంచిలి: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) ఇటీవల వెలువడుతున్న, జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో పలువురు తెలుగువారు తమ అద్భుత ప్రతిభను చూపుతున్నారు. వారిలో ముందు వరుసలో నిలిచారు, పశ్చిమగోదావరి జిల్లా, మండల కేంద్రమైన యలమంచిలికి చెందిన తమ్మినీడి ప్రణవి శ్రీలక్ష్మి. జేఈఈ మెయిన్స్ లో 99.54 పర్సంటేయిల్ సాధించారు. ఈమె తండ్రి తమ్మినీడి శ్రీనివాస్, విశాఖపట్నంలో జర్నలిస్టుగా కాగా. తల్లి ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకురాలు. ప్రణవి, ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేయాలని, లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు తెలిపారు. సాఫ్ట్వేర్…

Read More

సఖినేటిపల్లి నుంచి జాతీయ రహదారి 216.

రాజోలు: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) దిండి – చించినాడ గోదావరిపై నది పై నిర్మించిన వంతెన, ఉభయ గోదావరి లను కలుపుతూ 216 జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంది. సఖినేటిపల్లి మీదుగా 216 జాతీయ రహదారి కలపటానికి, సుప్రీంకోర్టులో కేసు అడ్డంకిగా మారింది. ఈ కేసు మంగళవారం సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇంతకాలం,ఇందువల్ల జాతీయ రహదారికి అడుగు ముందుకు పడలేదు. రాజులు నియోజకవర్గ అభివృద్ధికి 216 జాతీయ రహదారి ఎంతో దోహదపడుతుంది. ఈ కేసులో, రాజోలు జనసేన,…

Read More