Telugu News Power

పాలకొల్లు-దొడ్డిపట్ల ఆర్ అండ్ బి రోడ్డు పనులు ప్రారంభం

యలమంచిలి:జనవరి,21(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు నుచి దొడ్డిపట్ల పోవు రోడ్లు, భవనాల శాఖ పరిధిలో గల రోడ్డు పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, నవంబర్ నెలలో శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు కి.మీ.0.000 నుంచి 11.600 వరకు అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం 5 కోట్ల రూపాయల ఎస్ హెచ్ ప్లాన్ నిధులు మంజూరు చేయించారు. ఈ పనులు స్థానిక అడ్డాల వెంకటరత్నం నగర్, పెట్రోల్ బంకు దగ్గర నుంచి…

Read More

పదవ తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదల

విజయవాడ: జనవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి పరీక్ష తేదీలు మార్పులు చేశారు. మార్చ్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు టైం టేబుల్ మార్చి, 16 – తెలుగు (ఫస్ట్ లాంగ్వేజ్) మార్చ్,18, – హిందీ (సెకండ్ లాంగ్వేజ్) మార్చ్ ,20 – ఇంగ్లీష్ మార్చి, 23…

Read More

నేడే యలమంచిలి, పుంతల ముసలమ్మ, మహా అన్నదానం.

యలమంచిలి: జనవరి,20(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి, కుళాయి చెరువు వద్ద గల, శ్రీశ్రీశ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా, బుధవారం, సాయంత్రం, మాంసాహార వంటకాలతో మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో 12 రకాల వంటకాలు భక్తులకు రుచి చూపనున్నారు.

Read More

కన్యకా పరమేశ్వరి మహోన్నత త్యాగమూర్తి – మంత్రి నిమ్మల.

పెనుగొండ: జనవరి,20(తెలుగు న్యూస్ పవర్) పవిత్ర పెనుగొండ క్షేత్రంలో,ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కన్యకా పరమేశ్వరి అని వాసవి మాతను రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ప్రస్తుతించారు. వాసవి మాత ఆత్మార్పణ పర్వదినం సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అధికార లాంఛనాలతో మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు కుటుంబ సమేతంగా సమర్పించారు. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు, పితాని సత్యనారాయణ, వాసవి మాతకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల…

Read More

కొలువుదీరిన, కొత్త ఆర్టిఐ కమిషనర్ లు

అమరావతి: జనవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర ప్రభుత్వం, నియమించిన ఆర్టిఐ కమిషనర్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఆదివారం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రధాన సమాచార కమిషనర్ గా, ప్రముఖ అడ్వకేట్, వజ్జా శ్రీనివాసరావు, వట్టికూటి శరత్చంద్ర కళ్యాణ చక్రవర్తి, గాజుల ఆదెన్న, ఒంటేరు రవిబాబు, పరవాడ సింహాచలం నాయుడు కమిషనర్లు గా నియమితులయ్యారు. వీరి చేత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కె విజయయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరు మూడేళ్లపాటు…

Read More

కోటి 80 లక్షలతో క్రైస్తవ స్మశాన వాటికల అభివృద్ధి పనులు

పాలకొల్లు: జనవరి,19 (తెలుగు న్యూస్ పవర్) దళితులు,దళిత క్రైస్తవులు, మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వ లక్ష్యంగా, ధ్యేయంగా, పనిచేస్తుందని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పని చేసే ప్రభుత్వానికి తమ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక క్రైస్తవ స్మశాన వాటిక అభివృద్ధి, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇందుకు ప్రభుత్వం పుట్టినరోజులు మంజూరు చేసినట్టు తెలిపారు.27 వార్డులో స్మశాన వాటిక పనులకు 30 లక్షల రూపాయలు కేటాయించారన్నారు. ఈ…

Read More

ఎన్టీఆర్ వర్ధంతి కి సైకిళ్ల పంపిణీ.

యలమంచిలి: జనవరి,18(తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలి లో తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా 27 మందికి కొత్త సైకిళ్ళు ఉచితంగా పంపిణీ చేశారు. విద్యార్ధినిలకు, రోజువారి వ్యవసాయ కార్మికులకు ఈ సైకిళ్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో బొప్పన రాంబాబు, చిలుకూరి ఆంజనేయులు, తాళ్లూరు చందు, ఆకుల యేసు, బొప్పన సురేష్, కాసా సత్య, పలువురు గ్రామ పెద్దలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

అన్న ఎన్టీఆర్ కు ఘననివాళి

యలమంచిలి: జనవరి,18(తెలుగు న్యూస్ పవర్) విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,సంక్షేమ పథకాలకు ఆద్యుడు, కేవలం తొమ్మిది నెలల్లో పార్టీనీ అధికార పీఠంపై అధిష్టించి, ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రాజకీయదురంధరుడు, అన్న, స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వాడవాడల జరుపుకున్నారు. మండల కేంద్రమైన యలమంచిలి లో తెలుగుదేశం నియోజకవర్గ నాయకులు, సొసైటీ అధ్యక్షులు,బొప్పన హరి కిషోర్, ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. యలమంచిలి కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న…

Read More

ఎన్టీఆర్ ఓ చరిత్ర – మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: జనవరి,18(తెలుగు న్యూస్ పవర్) ఎన్టీఆర్ అంటే ఓ చరిత్రని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా, స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తర్వాత అనేంత మార్పు తీసుకువచ్చిన మహనీయుడని జోహార్లు అర్పించారు. తెలుగుజాతి ఖ్యాతి ప్రపంచం నలుమూలల ఎన్టీఆర్ వల్ల విస్తరించిదన్నారు. సంక్షేమ కార్యక్రమాలు…

Read More

ఆర్టిసి బస్సులో దొంగల చేతివాటం.

పాలకొల్లు: జనవరి,17(తెలుగు న్యూస్ పవర్) అసలే పండగ రోజులు, ఆపై శనివారం సంత రద్దీ, దొంగలకు బాగా కలిసి వచ్చింది. నరసాపురం డిపోకు చెందిన, పాలకొల్లు-ఏలూరు రూటు, ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళా ప్రయాణికులు తమ సొత్తు పోగొట్టుకున్నారు. పండగ సందర్భంగా పుట్టింటికి, పాలకొల్లు వచ్చిన పోలిశెట్టి అరుణ కుమారి, తిరుగు ప్రయాణంలో ఏలూరు బస్సు ఎక్కారు. పూలపల్లి దగ్గర, పర్సు చూసుకోగా 10 కాసుల బంగారం పోయినట్టు గమనించారు. యలమంచిలికి చెందిన, తాళ్లూరి సాయి పద్మజ,…

Read More