పాలకొల్లు: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం గ్రామోత్సవం నిర్వహించారు. రావణబ్రహ్మ వాహనంపై స్వామివారు పుర ప్రజలకు అనుగ్రహ దర్శనం చేశారు. ఈ ఊరేగింపులో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తలు బసవ సత్యనారాయణ, పినిశెట్టి శ్రీనివాస్ తదితరులు, భక్తులు పాల్గొన్నారు.
శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా
రావణబ్రహ్మ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం