పాలకొల్లు: మార్చి 17, (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం రుద్ర హోమం జరిగింది. ఈ సందర్భంగా శివ సహస్రనామ పూజలు చేశారు. లీలా కళ్యాణం సాయంత్రం జరిగింది. భక్తులు ఈ కార్యక్రమాల్లో పూజలు జరిపారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి, ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, ప్రధాన అర్చకులు క్రిష్టప్ప, అభిషేక పండితులు వెంకన్న, ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు

రుద్ర హోమం లో పాల్గొన్న చైర్మన్ మీసాల రాము