Skip to main content

Telugu News Power

మంత్రి పిలుపుతో సేదతీరిన శ్రామికులు.

చల్లని మజ్జిగ సేవిస్తున్న శ్రామికులు

పాలకొల్లు: మే, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు ఉపాధి హామీ శ్రామికుల, దాహార్తిని తీర్చేందుకు మొబైల్ మజ్జిగ చలివేంద్రాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన టిడిపి శ్రేణులు మజ్జిగ అందజేశారు. నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకంలో పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా, పాలకొల్లు మండలం, తిల్లపూడి, గవరపేట, దగ్గులూరు, అరట్లకట్ట, వరి ధనం, సగం చెరువు, పూలపల్లి, చింతపర్రు, ఆగర్తిపాలెం, వెంకటాపురం, లంకల కోడేరు, వెలివిలి, వడ్లవాని పాలెం, చందపర్రు, దిగమర్రు, ఆగర్రు, పెదమామిడిపల్లి, కొత్తపేట, యలమంచిలి మండలం కంచుస్తంభంపాలెం, గుంపర్రు, లక్ష్మీపాలెం, పెనుమర్రు, నేరేడుమిల్లి, మేడపాడు, ఆర్య పేట, పోడూరు మండలం, జున్నూరు, కొమ్ముచిక్కాల గ్రామాల్లో, మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో స్థానిక టిడిపి శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాతలు మజ్జిగ చలివేంద్ర కేంద్రాలు నిర్వహించటానికి తమ సౌజన్యం అందించారు.