యలమంచిలి: జూన్, 19( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఆర్య పేట విద్యార్థులకు శుక్రవారం ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పాలకొల్లు లాకుపేటకు చెందిన అంబేద్కర్ సేవా సమితి వారు తమ సౌజన్యంతో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మండపాక రాంబాబు, సేవా సమితి సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు
అంబేద్కర్ సేవా సమితి నోటు పుస్తకాల పంపిణీ.