గుంటూరు: ఆగస్టు,1 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
విద్యాదాత, తులసి సీడ్స్ అధినేత, తులసి రామచంద్ర ప్రభు నుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా నియమించిన ఉత్తర్వులు శనివారం విడుదలయ్యాయి. ఎంతోమంది విద్యార్థులకు కోట్ల రూపాయలు ఉపకార వేతనాలుగా అందించిన మహానుభావులు, దాత తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత తులసి రామచంద్ర ప్రభుకు పలువురు శుభాభినందనలు తెలిపారు.
ఏ ఎన్ యు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా తులసి రామచంద్ర ప్రభు నియామకం.
విద్యాదాత తులసీ రామచంద్ర ప్రభు