Skip to main content

Telugu News Power

Telugu News Power

విప్లవ వీరుడు ఉయ్యాలవాడ విగ్రహావిష్కరణ.

భారతీయుల ధైర్య సాహసాలను ఆదిలోనే రుచి చూపిన విప్లవ వీరుడు, తెల్ల వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన విప్లవ జ్యోతి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ ఘనంగా ఆదివారం జరిగింది. మార్టేరు కూడలి దగ్గర ఏర్పాటు చేసిన విగ్రహాన్ని రాష్ట్రరోడ్లు భవనాల శాఖమంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విశేషంగా ప్రజలు తరలి వచ్చారు. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, రాష్ట్ర రవాణా శాఖమంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మాజీ…

Read More

కార్తీక వన సమారాధనలతో హోరెత్తిన పాలకొల్లు

కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం పాలకొల్లు పట్టణాన్ని హోరెత్తించింది. కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో వివిధ సంఘాలవారు ఒకేరోజు ఈ కార్యక్రమాన్ని జరపడంతో పట్టణం సందడిగా మారింది.ఎక్కడ చూసినా ఆయా సంఘాల సభ్యులు కుటుంబ సమేతంగా వనభోజనాలకు తరలి వెళ్లారు. అక్కడ నిర్వహించిన వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు వారికి ఏర్పాటు చేసిన ఆటల్లో కేరింతలు కొడుతూ ఆనంద పడ్డారు. కొన్నిచోట్ల శాస్త్రీయ నృత్య కార్యక్రమాలు జరిగాయి. ఆడవారికి హౌసీ లక్కీ డిప్…

Read More

విద్యార్థులకు వరం పాలకొల్లు సైన్స్ సెంటర్

పాలకొల్లు: నవంబర్,16( తెలుగు న్యూస్ పవర్) చూసి తెలుసుకున్న దాని కంటే, చేసి నేర్చుకున్నది చిరకాలం గుర్తుండి పోతుందని ప్రముఖ వైద్యులు, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. పాలకొల్లు హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల సుభాష్ చంద్రబోస్ హై స్కూల్ వెనుక ఉన్న అద్దె భవనంలో సైన్స్ సెంటర్ ఆదివారం ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ బాబ్జి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుత సమాజానికి సైన్స్ అవసరం ఎంతో ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ముందుగా…

Read More

నేడే 21వ పాలకొల్లు కాపు వనభోజన సమారాధన

పాలకొల్లు, నవంబర్,16(తెలుగు న్యూస్ పవర్). పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో 21వ కాపు వన సమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహిస్తున్నట్టు కాపు ప్రముఖులు వంగా నరసింహారావు తెలిపారు. పాలకొల్లు బైపాస్ రోడ్ లోని ఎస్కన్వెన్షన్ ఎదురుగా ఉన్న స్థలంలో వనభోజనాలు జరుగుతాయి అన్నారు. దాదాపు 15 వేలమంది ప్రతి ఏట ఈ వనభోజనాలకు హాజరవుతారు అన్నారు. మహిళలకు పిల్లలకు యువకులకు దాదాపు పది రకాల ఈవెంట్స్ ఈ కార్యక్రమంలో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి అందరు కాపు ప్రముఖుల తో…

Read More

ఇంజనీర్ల సంఘం ఏకగ్రీవ ఎన్నిక

పాలకొల్లు, నవంబర్14(తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం ఎన్నికలు శుక్రవారం ఏకగ్రీవంగా జరిగాయి. కల్వకొలను దుర్గ రామస్వామి అధ్యక్షునిగా, జీవీఎస్ఎన్ స్వామి నాయుడు ప్రధాన కార్యదర్శిగా, డి.రాంబాబు ఉపాధ్యక్షుడిగా, బీ. కాలేశ్వర రావు, కోశాధికారిగా కె సత్య ఋషి,ఆర్గరైజింగ్ కార్యదర్శిగా, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక, సుబ్రమణ్యం రాజు పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు సంఘసభ్యులు హాజరయ్యారు.

Read More

నేడే స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ విగ్రహఆవిష్కరణ

భారత స్వాతంత్ర్య సంగ్రామ విప్లవాగ్ని రగిలించిన తొట్టతొలి యోధుడు, భరతజాతి ముద్దు బిడ్డ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. తలతెగిపడినా, మొండెం ఆధారంగా యుద్ధం చేసిన మహావీరుడు, సమరసింహం ఈ నరసింహారెడ్డి. త్యాగాల ఉయ్యాల స్పూర్తి,భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఓ మహాధ్యాయం. వీరి జీవితచరిత్ర మూలంతో, సైరా నరసింహా రెడ్డి పాత్ర చిరంజీవి నటించి చలన చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించారు. ఈ విప్లవవీరుల విగ్రహాన్ని పెనుమంట్ర మండలం, మార్టేరు కూడలి వద్ద నేడు ఆదివారం…

Read More

విష్ణాలయంలో కార్తీక వన సమారాధన

యలమంచిలి, నవంబర్ 14 (తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలి శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉసిరివనంలో కార్తీక వన సమారాధన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయంలో విశేష పూజలు చేశారు.పలువురు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన ప్రసాద వితరణ జరిగింది .ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు చిలుకూరి ఆంజనేయులు వారి ధర్మకర్తలు అర్చకులు వాడపల్లి గోపి తదితర ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు.  

Read More

ప్రశాంత్ కిషోర్ బుట్టలో పడని బీహార్ ఓట్లు

భారతదేశంలో బీహార్ రాష్ట్రం చాలా ప్రత్యేకమైనది.ఇక్కడ ఇంకా రాతియుగం నాటి సామాజిక ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. అత్యంత క్రూరమైన అంతర్గత ఊచకోతలు ఇక్కడి ప్రజలకు సుపరిచితం. నా మిత్రుడు ఒకరు బీహార్ కు చెందిన అనంత్ ఝా.ఇతను బీహార్ లో మనుగడ సాగించలేక ఢిల్లీకి చేరిన దేశం లోనే ఒక కాందీశీకుడుకుడు. ఇది నాకు ప్రత్యక్షమైన ప్రత్యక్ష అనుభవం. ఇక లోతుకు వెళితే ఇలాంటి సంఘటనలు ఎన్నో. మానవీయ విలువలకు అక్కడ అంతగా చోటు ఉండదు. అక్కడ నాయకులు…

Read More

ఆహ్లాదకరంగా బాలల దినోత్సవం

పాలకొల్లు, నవంబర్,14 ( తెలుగు న్యూస్ పవర్) బాలల దినోత్సవం సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గం లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో ఆహ్లాదకరంగా వేడుకలు నిర్వహించారు. యలమంచిలి మండలం పెనమర్రు, ఎలమంచిలి అడవిపాలెం ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులు వివిధ కార్యక్రమాలలో తమ ప్రతిభ ప్రదర్శించారు. ఆయా పాఠశాల ఉపాధ్యాయులు శేష సాయి, పోలిశెట్టి క్రాంతి, శ్రీదేవి జయంతి, కుమారి తదితర పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాలకొల్లు నారాయణ పాఠశాలలో చిన్నారులు ఉత్సాహంగా అనేక సాంస్కృతి కార్యక్రమాలతో అలరించారు.ఈ…

Read More

మంత్రి నిమ్మల మోటార్ సైకిల్ ర్యాలీ

పాలకొల్లు, నవంబర్ 14 ( తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు తెలుగుదేశం నూతనకమిటీల ఆవిర్భావ సభకు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకొల్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మోటార్ సైకిల్ ర్యాలీ తో లంకలకోడేరు తరలి వెళ్లారు. పాముల రజిని కుమార్ మండల తెలుగుదేశం అధ్యక్షులుగా, ఇతర అనుబంధ విభాగాల సభ్యులు పదవీప్రమాణస్వీకారం చేశారు. ఈ సభలో తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ అధ్యక్షులు…

Read More