Telugu News Power

Telugu News Power

శ్రీశ్రీ శ్రీ మూలస్తానేశ్వరి, వైభవంగా నూతన ఆలయ ప్రవేశ ప్రారంభోత్సవం.

యలమంచిలిని చల్లగా చూసే తల్లి, శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి బింబ,యంత్ర శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మశ్రీ కాళ్ళకూరి దుర్గాప్రసాద్ శర్మ ఆచార్యతంలో,బ్రహ్మశ్రీ యలమంచిలి నరేంద్ర శర్మ బ్రహ్మత్వంలో ఈ ప్రతిష్టా కార్యక్రమం బుధవారం, వేదపఠం ఘోషతో వైభవంగా ప్రారంభమైంది. గణపతి ప్రార్థన, మంగళ వాయిద్యలతో ఆలయ, యాగశాల ప్రదక్షణం చేశారు. భూతబలి, విగ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ఆరాధన, ప్రోక్షనలు, ప్రాశనలు, ఋత్విక్ వరుణలు, దీక్షాధారణ, అఖండ జ్యోతి ప్రజ్వలన,…

Read More

ప్రణవి, మెయిన్స్ లో అద్భుత ప్రతిభ.

యలమంచిలి: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) ఇటీవల వెలువడుతున్న, జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో పలువురు తెలుగువారు తమ అద్భుత ప్రతిభను చూపుతున్నారు. వారిలో ముందు వరుసలో నిలిచారు, పశ్చిమగోదావరి జిల్లా, మండల కేంద్రమైన యలమంచిలికి చెందిన తమ్మినీడి ప్రణవి శ్రీలక్ష్మి. జేఈఈ మెయిన్స్ లో 99.54 పర్సంటేయిల్ సాధించారు. ఈమె తండ్రి తమ్మినీడి శ్రీనివాస్, విశాఖపట్నంలో జర్నలిస్టుగా కాగా. తల్లి ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకురాలు. ప్రణవి, ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేయాలని, లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు తెలిపారు. సాఫ్ట్వేర్…

Read More

సఖినేటిపల్లి నుంచి జాతీయ రహదారి 216.

రాజోలు: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) దిండి – చించినాడ గోదావరిపై నది పై నిర్మించిన వంతెన, ఉభయ గోదావరి లను కలుపుతూ 216 జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంది. సఖినేటిపల్లి మీదుగా 216 జాతీయ రహదారి కలపటానికి, సుప్రీంకోర్టులో కేసు అడ్డంకిగా మారింది. ఈ కేసు మంగళవారం సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇంతకాలం,ఇందువల్ల జాతీయ రహదారికి అడుగు ముందుకు పడలేదు. రాజులు నియోజకవర్గ అభివృద్ధికి 216 జాతీయ రహదారి ఎంతో దోహదపడుతుంది. ఈ కేసులో, రాజోలు జనసేన,…

Read More

వాకర్స్ క్లబ్, పాలకొల్లు సహాయం.

పాలకొల్లు: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలోనే నిజమైన ఆనందం ఉన్నదని వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు పేర్కొన్నారు. కొత్త కుళాయి చెరువు వద్ద సభ్యులతో కలిసి,మంగళవారం స్థానిక క్లబ్ తరపున, పలువురికి సహాయం అందించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు, సలాది రామచంద్రరావు, కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు, సభ్యులు కటారి నాగేంద్ర కుమార్, చామా శ్రీనివాసరావు, మానెం ధనుంజయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీలో నులి పురుగు నివారణ కార్యక్రమం.

పాలకొల్లు: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) జాతీయ నులి పురుగు నివారణ కార్యక్రమం, మంగళవారం, స్థానిక ఏయస్ఎన్ యం, ప్రభుత్వ కళాశాలలో మంగళవారం జరిగింది. వైద్యులు ఎం సౌభాగ్యవతి, ఆల్బెండజోల్ మాత్రలు విద్యార్థులందరూ తప్పక వేసుకోవాలని సూచించారు. రక్తహీనతను తగ్గించడం, శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ టి. రాజరాజేశ్వరి, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ లక్ష్మి, టి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read More

విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం, లంకల కోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. పాఠశాలల్లో 6,328 మంది వద్దు లకు గాను 98 శాతం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమాన్ని ధనలక్ష్మి ప్రారంబభించారు. డాక్టర్ నవ్య జీవన్, మాత్రలు వేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు గంగాధర్ శర్మ, వీరస్వామి, పి సత్యనారాయణ రాజు, నెక్కంటి ఆదినారాయణ, ఆకుల ధనలక్ష్మీ,…

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశ పూజలు నేటి నుంచే.

యలమంచిలి: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశానికి, నేటి నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మూలస్థానేశ్వరి అమ్మవారి బింబ యంత్ర ప్రతిష్టాపన మహోత్సవాలో భాగంగా మొదటి రోజు, ఉదయం గణపతి ప్రార్ధన మంగళ వాయిద్యములతో ఆలయ ప్రదక్షిణ, భూతబలి, విగ్నేశ్వర పూజతో మొదలై సాయంత్రం వరకు బ్రహ్మశ్రీ కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ, బ్రహ్మశ్రీ యలమంచిలి నరేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఈ పూజలు రాత్రి వరకు కొనసాగుతాయి. అమ్మవారి ఆలయ తలుపులకు మంగళవారం…

Read More

జిల్లాలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సోలార్ వెలుగులు.

తాడేపల్లిగూడెం: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) జిల్లాకు తొలి విడతగా, 22,855 మంది ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు సోలార్ వెలుగులు ప్రసరించనున్నాయి. పి ఎం సూర్యఘర్ పధకం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ పధకం ద్వార కేంద్ర ప్రభుత్వం నిధులు 60 వేల రూపాయలు, మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మొదటి విడత లబ్ధిదారులకు 260.18 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యంగల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తారు. తాడేపల్లిగూడెంలో…

Read More

మారేడు దళ ప్రదక్షిణలు చేసిన భక్తులు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 16(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయం వారు నిర్వహిస్తున్న, ఏడు మారేడు దళములు, ఏడు ప్రదక్షిణల సేవలో సోమవారం భక్తులు పాల్గొన్నారు. సుమారు 300 మంది స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించి తరించారు. అనంతరం పంచహారతుల కార్యక్రమం శివాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, పర్యవేక్షకులు పి వాసు, భక్తులు పాల్గొన్నారు.

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ చారిత్రాత్మక ప్రారంభోత్సవం.

యలమంచిలి: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి ఇలవేల్పు, కోరిన వారికి కొంగు బంగారం, మహిమగల తల్లి శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ పునః నిర్మాణం, పూర్తి చేసుకుంటూ, బింబ, యంత్ర, శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలుః మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఉద్దండ పండితులు, బ్రహ్మశ్రీ కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ, ఆచార్యత్వంలో, బ్రహ్మశ్రీ, యలమంచిలి నరేంద్ర శర్మ, బ్రహ్మత్వంలో ,ఈ విశేష పూజలు జరగనున్నాయి. ఈనెల 18 నుంచి 20 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. గణపతి…

Read More