Telugu News Power

Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎం విద్యార్థుల ప్రతిభ

పాలకొల్లు ఆర్ టి ఐ హెచ్- సీసీఈ ఇన్నో ట్రై కార్యక్రమంలో స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. స్టార్ తప్పు మైండ్ సెట్, ఇంట్రడక్షన్ టు ఎంటర్ ప్రిన్యూర్ షిప్ కోర్సులు పూర్తి చేసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ కళాశాలలో కోర్సు పూర్తి చేసుకున్న వారిలో 10మంది, ఏ ఎస్ ఎన్ ఎం. కళాశాల వారు ఉండటం పట్ల ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, విద్యార్థులను గురువారం జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా…

Read More

తహశిల్దార్ కార్యాలయం వద్ద విఆర్వోల నిరసన.

యలమంచిలి: ఫిబ్రవరి, 19 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వీఆర్వోల నిరసన కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండల వీఆర్వోలు స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన తెలిపారు. జనవరి 12 నుంచి వర్కు టు రూల్ పాటించాలని సంఘం నిర్ణయించింది. వీఆర్వోలు రాత్రి పగలు తేడా లేకుండా బాధ్యతలు నిర్వహించవలసి రావడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఇందువల్ల కొందరు ప్రమాదాలకు గురవుతుంటే, మరి కొందరు ఆత్మహత్యలు పాల్పడ్డ…

Read More

రైల్వేవారు దారి వదలాలి రైతులు విజ్ఞప్తి.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) కోటిపల్లి-నరసాపురం రైల్వే లైను ఏర్పాటు గురించి సేకరించిన భూమిలో రైల్వే వారు తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు కంచె ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏనుగువానిలంక,కలగంపూడి మధ్య ఉన్న 7 ఎకరాలు భూసేకరణలో రైల్వే వారు తీసుకున్నారు. దీనికి సంబంధించి రైతులకు సొమ్ము కూడా అప్పుడే చెల్లించారు. రైతులు తమ వ్యవసాయ కార్యక్రమాలు ఇంతవరకు సజావుగా నిర్వహించుకుంటున్నారు. దాళ్వాపంట మాసూళ్లకువస్తున్న సమయంలో కంచ ఏర్పాటు చేయడం వల్ల రైతుల రాకపోకలకు అడ్డంకి ఎదురవుతుందని రైతులు…

Read More

భక్తులు అప్రమత్తంగా ఉండాలి. -నిర్వాహకుల విజ్ఞప్తి.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు అప్రమత్తతో ఉండాలని, తాళ్ళురి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి విజ్ఞప్తి చేశారు. శిఖరంపై పూజాలు నిర్వహించడానికి తాత్కాలికంగా మెట్లు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ఒకేసారి భక్తులు ఆ మెట్లపై నిలబడడం వల్ల బలం సరిపోక మెట్లు పడిపోయే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అది అమ్మవారికి, గ్రామానికి మంచిది కాదని తెలుసుకొని, భక్తులు…

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి, రెండో రోజు కుంకుమ పూజ, క్షీరాభిషేకం.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా, గురువారం కుంకుమ పూజ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహాలు, శిఖరాలతో గ్రామ ప్రదక్షణ జరిగింది. విగ్రహాలకు భక్తులు పాలు,పూలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ జలాధివాసం కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గవ్యాంతమార్జన, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తుబలి, పర్యగ్నికరణం,…

Read More

ఏటిగట్టు పనులతో ప్రమాదం -పాలకొల్లు వైసీపీ ఇన్చార్జ్ గుడాల గోపి ఆరోపణ

యలమంచిలి: ఫిబ్రవరి,18 (తెలుగు న్యూస్ పవర్) స్థానికంగా జరుగుతున్న ఏటిగట్టు పనులు ప్రమాదాన్ని తెచ్చి పెట్టేలా ఉన్నాయని పాలకొల్లు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి ఆరోపించారు. ఏటిగట్టు పక్కనే ఉన్న మట్టి తవ్వి, పైకి వేయడం వల్ల వరదలు వచ్చినప్పుడు ఆ గట్టు బలం లేక కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏటిగట్టు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని గోపి బుధవారం పరిశీలించారు. ఏటిగట్టు పనులు స్థానిక శాసనసభ్యులు…

Read More

సుప్రీంకోర్టు తీర్పు, నర్సాపురానికి బంగారు భవిష్యత్తు – ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ.

నర్సాపురం: ఫిబ్రవరి,18(తెలుగు న్యూస్ పవర్) గౌరవ భారత అత్యున్నత న్యాయస్థానం ప్రకటించిన తీర్పు,నరసాపురం ప్రాంత అభివృద్ధికి బంగారు బాటలు వేస్తుందని, స్థానిక లోక్సభ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రంలో, స్థానిక జనసేన ఎమ్మెల్యే, విప్ బొమ్మిడి నాయకర్ తో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. చించినాడ- దిండి, వశిష్ట వారధికి ఇరువైపులా ఉన్న జాతీయ రహదారి 216, విస్తరణ సంబంధించి భూసేకరణ విషయంలో, భూస్వాములు న్యాయం కోరుతూ,…

Read More

ప్రతి ఇంటికి పాడిపశువు ఉండాలి – కలెక్టర్ నాగరాణి

పాలకొల్లు: ఫిబ్రవరి, 18(తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలం, అగర్తిపాలెంలో పశుసంవర్ధక శాఖ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సంయుక్తంగా నిర్వహించిన మెగా పశు వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం ప్రారంభించారు. గోమాతకు పూజలు చేసి శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్, గర్భకోశ శస్త్రచికిత్స, నట్టల నివారణ, గోమార్ల నివారణ, ఉచిత మందులు, ల్యాబ్ పరీక్షలను స్వయంగా పరిశీలించారు. రైతుల సమావేశంలో మాట్లాడుతూ,స్వచ్ఛమైన పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, కల్తీ పాల వల్ల ప్రమాదాలు…

Read More

కత్తి పట్టిన క్షత్రియులు.

పాలకొల్లు: ఫిబ్రవరి,18(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో, ఆఖరి మజిలీ చేసే స్మశాన ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి సంకల్పించినట్టు, పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు, గాంధీ మెగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పేర్కొన్నారు. స్థానిక పూలపల్లి, రాజుల స్మశాన వాటిక ప్రాంతాన్ని భగవాన్ రాజు ఆధ్వర్యంలో పలువురు క్షత్రియులు కత్తి పట్టి శ్రమదానం చేసారు.అడవిలా…

Read More

నర్సాపురం వద్ద వంతెన నిర్మించాలి. -కాంగ్రెస్ పార్టీ డిమాండ్

నరసాపురం: ఫిబ్రవరి, 18 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక వశిష్ట గోదావరిపై వెంటనే వంతెన నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. జిల్లా బీసీ నాయకులు,కొలకలూరి అర్జునరావు ఆధ్వర్యంలో బుధవారం, వాళ్ళందర్ రేవులో అర్జున్ రావు మాట్లాడుతూ, 2004 నుంచి చాలా ప్రభుత్వాలు మారినప్పటికి, ఇప్పటికీ బ్రిడ్జి నిర్మించకపోవడం పట్ల నిరసన తెలిపారు. సముద్రంలో కూడా బ్రిడ్జిలు కడుతున్న నేటి అభివృద్ధి చెందిన సాంకేతిక నైపుణ్యంతో, నర్సాపురం వంటి చిన్ని గోదావరి నిర్మించలేకపోవటం, ప్రజల్ని మభ్యపెట్టడమేనన్నారు. తాము…

Read More