Telugu News Power

Blog

క్షయ వ్యాధి పరీక్షలు

పాలకొల్లు: ఫిబ్రవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నవ్య జీవన్ ఆధ్వర్యంలో టీబీ వారోత్సవాలు కార్యక్రమాన్ని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ రవిబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి బాబు మాట్లాడుతూ ప్రతి క్షయ అనుమానిత గలవారికి రెండు వారాల మించి దగ్గు,జ్వరం, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం లక్షణాలు గల వారందరికీ స్క్రీనింగ్ పరీక్షలు చేసి క్షయ నిర్ధారణ పరీక్షలు చేసి మరియు అవసరమైన…

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి, శ్రీశ్రీశ్రీ పుంతల ముసలమ్మ వారి సారె.

యలమంచిలి: ఫిబ్రవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి మూల విరాట్ నూతన ఆలయ ప్రవేశం, సందర్భంగా, యలమంచిలి లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి ఆలయం నుంచి శుక్రవారం సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం అపూర్వం.

యలమంచిలి: ఫిబ్రవరి,20(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం నభూతో, నభవిష్యతి అన్న రీతిలో అపూర్వంగా, అద్భుతంగా జరిగింది. యలమంచిలి ఆధ్యాత్మిక చరిత్రలో, మరో 100 ఏళ్ళ వరకు ఇలాంటి ఘట్టం మళ్లీ ఆవిష్కృతం కావటం ఒక అరుదైన ఘట్టంగా గ్రామస్తులు అంచనా వేస్తున్నారు. అమ్మవారి నూతన ఆలయ బింబ- యంత్ర- శిఖర ప్రతిష్ఠామహోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా సంపూర్ణం అయ్యాయి. ఈనెల 18వ తేదీ నుంచి మొదలైన ఈ…

Read More

రైతులు వెంటనే ఈ-పంట నమోదు చేసుకోవాలి.

పాలకొల్లు: ఫిబ్రవరి, 20(తెలుగు న్యూస్ పవర్) రైతులు వెంటనే ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని, స్థానిక వ్యవసాయ సంచాలకులు పి. మురళీకృష్ణ శుక్రవారంవిజ్ఞప్తి చేశారు. ఈనెల 25 ఈ-క్రాప్ నమోదుకు గడువు ముస్తుందని వెల్లడించారు. పాలకొల్లు మండలంలో 9,900, పోడూరు మండలంలో14,500, ఆచంట మండలం10, 250 ఎకరాల్లో దాళ్వాపంట సాగుతున్నట్టు నమోదయింది. ఇప్పటికీ కూడా కొంతమంది విదేశాల్లో ఉన్నవారు, రాస్ట్రేతర ప్రాంతాల్లో ఉన్నవారు, ఓటిపి ద్వారా కూడా ఈ-నమోదు చేయించుకోవచ్చు అని తెలిపారు. ఫార్మర్స్ రిజిస్ట్రేషన్(ఏపీ ఎఫ్ ఆర్)…

Read More

డిజిటల్ టెక్నాలజీతో 8వ జనగణన.

అమరావతి: ఫిబ్రవరి,20(తెలుగు న్యూస్ పవర్) భారతదేశంలో పదేళ్లకు ఒకసారి జరిగే జనగణన కరోనా తదితర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. భారతదేశంలో జరిగే 16వ జనాభా లెక్కల గణన ఇది. స్వాతంత్ర భారతదేశంలో 8వ జనగణన. వచ్చే ఏడాది ఈ జనగణన ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోకూడా జనాభా లెక్కల సేకరణకు ముందస్తు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కే. విజయానంద్ స్థానిక సచివాలయంలో ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారుల(కలెక్టర్ల)తో శుక్రవారం సన్నాహక…

Read More

ఉచిత కంటి పరీక్షల శిబిరం

పాలకొల్లు: స్థానిక శ్రీ ఏ. ఎస్.ఎన్. ఎం. ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల రెడ్ రిబ్బన్ క్లబ్,ఎన్‌సి‌సి యూనిట్ మరియు అమరావతి కంటి ఆసుపత్రి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీ టి. కృష్ణ ప్రధాన అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా కంటి ఆరోగ్యం విద్యాభ్యాసంలో కీలక పాత్ర పోషిస్తుందని…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం విద్యార్థుల ప్రతిభ

పాలకొల్లు ఆర్ టి ఐ హెచ్- సీసీఈ ఇన్నో ట్రై కార్యక్రమంలో స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. స్టార్ తప్పు మైండ్ సెట్, ఇంట్రడక్షన్ టు ఎంటర్ ప్రిన్యూర్ షిప్ కోర్సులు పూర్తి చేసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ కళాశాలలో కోర్సు పూర్తి చేసుకున్న వారిలో 10మంది, ఏ ఎస్ ఎన్ ఎం. కళాశాల వారు ఉండటం పట్ల ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, విద్యార్థులను గురువారం జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా…

Read More

తహశిల్దార్ కార్యాలయం వద్ద విఆర్వోల నిరసన.

యలమంచిలి: ఫిబ్రవరి, 19 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వీఆర్వోల నిరసన కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండల వీఆర్వోలు స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన తెలిపారు. జనవరి 12 నుంచి వర్కు టు రూల్ పాటించాలని సంఘం నిర్ణయించింది. వీఆర్వోలు రాత్రి పగలు తేడా లేకుండా బాధ్యతలు నిర్వహించవలసి రావడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఇందువల్ల కొందరు ప్రమాదాలకు గురవుతుంటే, మరి కొందరు ఆత్మహత్యలు పాల్పడ్డ…

Read More

రైల్వేవారు దారి వదలాలి రైతులు విజ్ఞప్తి.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) కోటిపల్లి-నరసాపురం రైల్వే లైను ఏర్పాటు గురించి సేకరించిన భూమిలో రైల్వే వారు తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు కంచె ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏనుగువానిలంక,కలగంపూడి మధ్య ఉన్న 7 ఎకరాలు భూసేకరణలో రైల్వే వారు తీసుకున్నారు. దీనికి సంబంధించి రైతులకు సొమ్ము కూడా అప్పుడే చెల్లించారు. రైతులు తమ వ్యవసాయ కార్యక్రమాలు ఇంతవరకు సజావుగా నిర్వహించుకుంటున్నారు. దాళ్వాపంట మాసూళ్లకువస్తున్న సమయంలో కంచ ఏర్పాటు చేయడం వల్ల రైతుల రాకపోకలకు అడ్డంకి ఎదురవుతుందని రైతులు…

Read More

భక్తులు అప్రమత్తంగా ఉండాలి. -నిర్వాహకుల విజ్ఞప్తి.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు అప్రమత్తతో ఉండాలని, తాళ్ళురి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి విజ్ఞప్తి చేశారు. శిఖరంపై పూజాలు నిర్వహించడానికి తాత్కాలికంగా మెట్లు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ఒకేసారి భక్తులు ఆ మెట్లపై నిలబడడం వల్ల బలం సరిపోక మెట్లు పడిపోయే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అది అమ్మవారికి, గ్రామానికి మంచిది కాదని తెలుసుకొని, భక్తులు…

Read More