Telugu News Power

Blog

వీఆర్వోల వర్క్ టు రూల్ నేటి నుంచే

యలమంచిలి: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) వీఆర్వోలు వర్క్ టు రూల్ పాటించి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పనిగంటలు ఉండాలని డిమాండ్ చేశారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం మండల వీఆర్వో, వీఆర్ఏలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వీఆర్వోల ఐక్యత వర్ధిల్లాలని, పని గంటలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఇఎఫ్ఎస్ సర్వే, జాయింట్ ఎల్ పి ఎన్, సుమోటో క్యాస్ట్ సర్టిఫికెట్స్ వంటి వివిధ పనులతో…

Read More

శివరాత్రికి వీరభద్రుని సంబరాలు

పాలకొల్లు: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ పవర్) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వీరభద్ర స్వామి సంబరాలు వాడవాడలా జరిగాయి. స్థానిక కొత్తపేట వీరభద్ర స్వామి గుడి వద్ద స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు స్వయంగా ఘటం శిరస్సుపై ధరించారు. భక్తులు వీరభద్రుని గద్దెల నుంచి జమ్మి చెట్టు వద్దకు, దేవాలయాలకు వెళ్లి ప్రసాదాలు, పానకాలు పంచారు. ఈ సందర్భంగా భక్తులు, తుము కోర్కెలు నెరవేర్చాలని, నిప్పుల గుండం పై నడిచారు. యలమంచిలి వీరభద్ర స్వామి గుడి వద్ద…

Read More

శివనామస్మరణతో మారుమ్రోగిన శైవక్షేత్రాలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ పవర్) శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రం, స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం తెల్లవారుఝామున 3గంటలకే తెరిచారు. దర్శనం కోసం భక్తులు 4 గంటల నుంచి విశేషంగా తరలివచ్చారు. ఉపవాస దీక్ష, జాగారం చేస్తూ చాలామంది భక్తులు ఆలయంలోనే ఉండిపోయారు. ఆలయానికి వచ్చిన భక్తులకు, వివిధ ధార్మిక సంస్థల వారు త్రాగునీరు, ప్రసాదాలు అందజేశారు. లింగోద్భవ సమయంలో సరిగ్గా 12 గంటలకు అఖండ జ్యోతి ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర…

Read More

స్మశాన వాటిక పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు, శ్రమదానం.

పాలకొల్లు: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ పవర్) మహాశివరాత్రి, సందర్భంగా శివునికి ప్రీతిపాత్రమైన భస్మస్థలి లో ఆదివారం, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు స్వగ్రాము ఆగర్తిపాలెం, స్మశాన వాటికలో శ్రమదానం చేసి, గ్రామస్తులకు ఆదర్శంగా నిలిచారు. ఆఖరి మజిలీ, పవిత్రంగా, ప్రశాంతంగా, సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం తో మంత్రి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు కాకుండా, ఇతర సంస్థల నుంచి ఈ లక్ష్యం సాధించడానికి నిధులు సేకరిస్తున్నారు. స్మశాన వాటికలకు మంజూరైన 1.25 కోట్ల…

Read More

యుటిఎఫ్ రణభేరికి 17న తరలిరావాలి.

పాలకొల్లు: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయుల, సుదీర్ఘకాల, పెండింగ్ సమస్యలపై రణభేరి కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్, యుటిఎఫ్ సంఘం పిలుపునిచ్చింది. ఈనెల 17న విజయవాడలో ఉపాధ్యాయుల భారీ ప్రదర్శనకు సంసిద్ధులయ్యారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ప్రయోజనాలకు, ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా, మొండిచేయి చూపటంతో, ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈనెల17న తమకు రావలసిన ఆర్థిక బకాయిలు,పిఆర్సి కమిటీ నియామకం, ఐఆర్ ప్రకటించడం పై విజయవాడలో జరిగే రణభేరి 2.0 చలో విజయవాడకు…

Read More

దర్శకుడు బుచ్చి బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన,”పెద్ది”.

హైదరాబాద్: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ పవర్) మెగా గ్లోబల్ స్టార్, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న, పెద్ది చిత్ర దర్శకులు సాన బుచ్చిబాబుకు రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్ర కథ చెప్పే విషయంలో దర్శకులకు ఉన్న అభిరుచి, వివరంగా, లోతుగా చెప్పే విధానం స్ఫూర్తివంతంగా ఉందని రామ్ చరణ్ వెల్లడించారు. భవిష్యత్తులో మరెన్నో ఇలాంటి అద్భుత చిత్రాలు తీయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా, తాను ఎన్నో విషయాలు రామ్ చరణ్ నుంచి నేర్చుకున్నానని, ఈ చిత్రం…

Read More

సినీ నిర్మాత “అట్లూరి” అందరికీ ఆదర్శం.

హైదరాబాద్: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ కావాలి) సినీ నిర్మాత, అట్లూరి పూర్ణచంద్రరావుకు నవతి (90వ పుట్టినరోజు) మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. వీరు గేట్ కీపర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. కేవలం ఐదు రూపాయలు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. నిర్మాతగా 87 సినిమాలు, 9 భాషల్లో నిర్మించారు. వీరు తీసిన సినిమాలు ఎన్నో చరిత్ర సృష్టించాయి. సినిమాకు, విజయాలతో పాటు, విలువలు చేర్చిన నిర్మాతగా గుర్తింపు పొందారు. ఈయన సినీ ప్రస్థానం, ఎందరికో పాఠ్యపుస్తకం. లక్ష్యాలు…

Read More

దక్షిణ మధ్య రైల్వే జి ఎం రాక

నర్సాపురం: ఫిబ్రవరి, 14(తెలుగు న్యూస్ పవర్) దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాత్సవ, విజయవాడ, డివిజన్ డిఆర్ఎం మోహిత్ సోనాక్య, నరసాపురం రైల్వే స్టేషన్ ను శనివారం సందర్శించారు. అమృత్ భారత్ స్టేషన్ అభివృద్ధి కార్యక్రమం, భద్రత తనిఖీ కార్యక్రమాలు పర్యవేక్షించారు. వీరిని డి ఆర్ యు సి సి సభ్యులు, జక్కంపూడి కుమార్, పెద్దిరాజు వరి కంకులతో ఆహ్వానించారు. రైల్వేకు సంబంధించి ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం వీరు రైల్వే…

Read More

ఆక్వా రైతుల సమరభేరి.

పాలకొల్లు: ఫిబ్రవరి14(తెలుగు న్యూస్ పవర్)గత 15 రోజుల క్రితం నుంచి రొయ్యల దాణ రేట్లు పెంచవద్దని ఆక్వా రైతులు చేస్తున్న విజ్ఞప్తిని పెడచెవినపెట్టి, ఈనెల 4న, కిలోకు నాలుగు రూపాయల చొప్పున పెంచడంపై ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పన్నులు తగ్గించినప్పుడు, దానా రేటు తగ్గించకపోగా, ఆక్వా రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మూలిగే నక్కపై, తాటిపండు పడ్డట్టు, దాణా ధర పెంచడంపై రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానిక జై భారత్ క్షీరారామ రైతు సంఘం, అత్యవసరంగా శనివారం…

Read More

మావుళ్ళమ్మ వారికి బంగారం బహూకరణ.

భీమవరం: ఫిబ్రవరి,14(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ నిధికి ఆరు గ్రాముల బంగారం శనివారం భక్తులు సమర్పించుకున్నారు. భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయ స్వర్ణనిధికి భక్తులు విరివిగా కనకపు కానుకలు సమర్పించుకుంటున్నారు. ఈ సందర్భంగా, స్థానిక పుణ్య దంపతులు, కాసర బ్రహ్మాజీ రావు, శ్రీదేవి 4 గ్రాముల బంగారం, కన్నా బాలసుబ్రమణ్యం రాజు, అనూష 2 గ్రాముల బంగారం అమ్మవారికి కనకపు కానుక సమర్పించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు…

Read More