Telugu News Power

ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరం

యలమంచిలి, నవంబర్,30 (తెలుగు న్యూస్ పపర్) ప్లాస్టిక్ వాడకం ఎంత ప్రమాదకరమైనదో వివరిస్తూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అడవిపాలెం ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ అటానమస్ కాలేజీ విద్యార్థులు ఏడు రోజుల ప్రత్యేక ఎన్ ఎస్ ఎస్ క్యాంప్ నిర్వహణలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమం జరిపారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు రైసా అధ్యక్షులు చెరుకూరి…

Read More

యుటిఎఫ్ టెస్ట్ పేపర్ల ఉచిత పంపిణి.

యమంచిలి: నవంబర్ 29 తెలుగు న్యూస్ పవర్ మండలంలో ఉన్న 11 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు యుటిఎఫ్ టెక్స్ట్ పేపర్లు ఉచితంగా శనివారం పంపిణీ చేశారు. గత 15 ఏళ్లుగా దాతల సహకారంతో ఈ ఉచిత పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్టు యుటిఎఫ్ నాయకులు పోలిశెట్టి క్రాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఏ శ్రీవాణి కె.వి.ఆర్.రామకృష్ణంరాజులు ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ లియాఖత్ అలీ, దిగమర్తి రాంబాబు, రామేశ్వరపు సత్యనారాయణ, తెలుగుదేశం నాయకులు మామిడి శెట్టి…

Read More

ఆడబిడ్డలపై అభిమానం చాటుకున్న -మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి అటానమస్ కాలేజీ బాలికల వేచియుండు గది నిర్మాణం కోసం మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. గత ఏడాది ఈ నిర్మాణం కోసం మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఆ మేరకు భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.సుమారు 34 లక్షల రూపాయలు అంచనా తోఈ భవనంతో పాటు మరుగుదొడ్లు కూడా నిర్మిస్తారు. విద్యార్థినులకు ఉన్న ప్రత్యేక అవసరాలు దృశ్య ఈ నిర్మాణం తప్పనిసరి…

Read More

ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల ఆరోగ్య ర్యాలీ.

యలమంచిలి:నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో ఏ ఎస్ ఎన్ ఎం గవర్నమెంట్ కళాశాల విద్యార్థులు ఆరోగ్య ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కలిగించారు. ఇందుకు పలు సూచనలు చేశారు. ఈ ర్యాలీలో ఏఎన్ఎం సరళ వారి సిబ్బంది ఆరోగ్యం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గ్రామంలో తాగునీరు,మురికి నీటి సమస్య ఉన్నట్టు సర్వే ద్వారా గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన వల్ల వచ్చే ప్రమాదాలు గురించి…

Read More

ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం.

యలమంచిలి: నవంబర్,28 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ అటానమస్ కాలేజీ ఎన్.ఎస్.ఎస్ యూనిట్ 2 విద్యార్థులు శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. పాలకొల్లు మున్సిపల్ అధికారి, స్వచ్ఛఆంధ్ర, స్వర్ణాంధ్ర కోఆర్డినేటర్ పి.రోహిత్ కుమార్, ఉమా హాస్పిటల్స్ పాలకొల్లు డాక్టర్ ఉమా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కోఆర్డినేటర్ రోహిత్ కుమార్ మాట్లాడుతూ సామాజిక పరిశుభ్రత, తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం వంటి విషయాల గురించి విద్యార్థులకు…

Read More

75వ రాజ్యాంగ దినోత్సవ వేడుక

పాలకొల్లు: నవంబర్,26 (తెలుగు న్యూస్ పవర్)భారత రాజ్యాంగ 75 దినోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక లజపతిరాయ్ పేట లో గల అంబేద్కర్ భవనం వద్ద నిర్వహించారు. స్థానిక మాంటిసోరి పాఠశాల మరియు జూనియర్ కాలేజీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విద్యాసంస్థల అధినేత కలిదిండి కృష్ణ వర్మ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగ రచన పూర్తి చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు…

Read More

అద్దేపల్లి కాలేజీ కుర్రాళ్ళు ’60 ల్లోoచి,20 ల్లోకి’

పాలకొల్లు: నవంబర్,25(తెలుగు న్యూస్ పవర్) అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల 1982 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చేనెల 13,14 శని,ఆదివారలలో 20వ పడిలోకి జారుకుని మళ్లీ కుర్రాళ్ళు కాబోతున్నారు. భీమవరం దగ్గర గల జక్కరం గ్రామంలోని రిసార్ట్స్ ఇందుకు వేదిక కానున్నది. గతంలో 2015 లో ఈ పూర్వ విద్యార్థుల కలయిక ఘనంగా జరిగింది. సెప్టెంబర్,5 గురుపూజోత్సవం రోజున జరిగింది. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో, వారికి చదువులు నేర్పిన గురువులను, ఎక్కడెక్కడి…

Read More

జిల్లా విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

పాలకొల్లు నవంబర్ 22 తెలుగు న్యూస్ పవర్ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ శనివారం పాలకొల్లు బ్రాడీపేట లో గల ఎంపీజే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు.వారికి అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మండల విద్యాశాఖ అధికారులు గుమ్మల్ల వీరాస్వామి, ఆర్ వి ఎస్ గంగాధర శర్మ పాల్గొన్నారు.

Read More

యలమంచిలిమండల ఉపాధ్యాయ క్లస్టర్ సమావేశం.

యలమంచిలి: నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన, క్లస్టర్ సమావేశం యలమంచిలి మండలంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈసారి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు వేరుగాను, పాఠశాల సహాయక ఉపాధ్యాయులకు వేరుగాను ఈ సమావేశాలు నిర్వహించారు. యలమంచిలి మండలంలో ఉన్న మొత్తం 4 క్లస్టర్లలో ఈ సమావేశాలు జరిగాయి. యమంచిలి లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు క్లస్టర్ తో పాటు, స్కూల్ అసిస్టెంట్స్ క్లస్టర్ సమావేశం కూడా నిర్వహించారు. దాదాపు 300 మంది ఉపాధ్యాయులు ఈ…

Read More

కలెక్టర్ గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

  పాలకొల్లు: నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం సాయంత్రం పాలకొల్లు బ్రాడీపేట బైపాస్ రోడ్లు గల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ చేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల విద్యార్థులతో ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు మంచినీటి సమస్య,వసతి భవనం సరిపోకపోవడం, ఆట…

Read More