పోలియో ఆదివారం విజయవంతం
పాలకొల్లు:డిసెంబర్,21 (తెలుగు న్యూస్ పవర్) పోలియో వ్యాధి సమూల నిర్మూలనకు చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. పోలియో ఆదివారం సందర్భంగా పలుచోట్ల పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని తరిమి కొట్టడానికి, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పక పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద, దేశాలమ్మ గుడి వద్ద రోటరీ క్లబ్ పల్స్ పోలియో కేంద్రాలుఏర్పాటు చేసింది….