కన్యకా పరమేశ్వరి మహోన్నత త్యాగమూర్తి – మంత్రి నిమ్మల.
పెనుగొండ: జనవరి,20(తెలుగు న్యూస్ పవర్) పవిత్ర పెనుగొండ క్షేత్రంలో,ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కన్యకా పరమేశ్వరి అని వాసవి మాతను రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ప్రస్తుతించారు. వాసవి మాత ఆత్మార్పణ పర్వదినం సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అధికార లాంఛనాలతో మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు కుటుంబ సమేతంగా సమర్పించారు. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు, పితాని సత్యనారాయణ, వాసవి మాతకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల…