Telugu News Power

సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.

న్యూఢిల్లీ: మార్చి, 16(తెలుగు న్యూస్ పవర్.కామ్)తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ 2025 పురస్కారం ప్రకటించింది. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిన కవి నందిని సిధారెడ్డి. ఆయన రాసిన “అనిమేష” కవితా సంపుటికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. సిధారెడ్డి కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్ఛిన్నతలను చిత్రీకరించడంవల్ల తనకు…

Read More

కళాక్షేత్రానికి 8 కోట్లు -మంత్రి నిమ్మల వెల్లడి.

పాలకొల్లు: మార్చి, 15(తెలుగు న్యూస్ పవర్.కామ్) నిర్మాణంలో ఉన్న నందమూరి- బొండాడ కళాక్షేత్రానికి 8 కోట్ల రూపాయలు నిధులు మంజూరైనట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లు కళా పరిషత్తు ఆధ్వర్యంలో 3రోజులపాటు జరిగిన నాటిక పరిషత్తు ముగింపు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా ఆదివారం రాత్రి హాజరయ్యారు. ఈ సభకు కళాపరిషత్ అధ్యక్షులు కే.వి.కృష్ణ వర్మ అధ్యక్షత వహించారు. బిజెపి నాయకులు జక్కంపూడి కుమార్ స్వాగతం పలికారు. ఈ…

Read More

వేద పఠనం లో చరిత్ర సృష్టించిన దేవవ్రత్.

ముంబై: మార్చి ,15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మహారాష్ట్రలోని అహల్యనగర్‌కు చెందిన 19 ఏళ్ల వేద శుక్ల యజుర్వేద పండితుడు దేవవ్రత్ మహేష్ రేఖే సుమారు 200 సంవత్సరాల తర్వాత అత్యంత క్లిష్టమైన ‘దండక్రమ పారాయణం’ పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. ఆయన శుక్ల యజుర్వేదంలోని సుమారు 2,000 మంత్రాలను 50 రోజుల పాటు విరామం లేకుండా, దోషరహితంగా పఠించి, శృంగేరి శారదా పీఠం సహా పలువురి ప్రశంసలు అందుకున్నారు. వేద పఠనంలో అత్యంత కఠినమైన…

Read More

అల్లు శిరీష్ దంపతులకు ఎపి సీఎం చంద్రబాబు దీవెనలు.

హైదరాబాద్: మార్చి, 15,(తెలుగు న్యూస్ పవర్. కాం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాదులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గృహంలో ఇటీవల వివాహమైన అల్లు శిరీష్, నైనిక దంపతులను ఆశీర్వదించారు. అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు సీఎం సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా, స్టైలిష్ స్టార్, పాన్ ఇండియా స్టార్, అల్లు అర్జున్, ఇతర దేశాలలో ఉండటం వల్ల తన ఎక్స్ ఖాతా ద్వారా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కలయిక…

Read More

జనసేన పార్టీ నియోజకవర్గ కేంద్రం వద్ద ఘనంగా వేడుకలు.

నరసాపురం: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక జనసేన పార్టీ కార్యాలయం వద్ద పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ సభ ఘనంగా జరిగింది. జనసేన పార్టీ స్థాపన నుండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రతి గ్రామం వరకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చాను.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, మాజీ మంత్రివర్యులు…

Read More

ప్రజాపక్షం కూటమి ప్రభుత్వ లక్ష్యం.

నందిగరువు: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కం) కూటమి ప్రభుత్వం ప్రజలకు స్నేహపూర్వక పాలన అందిస్తుందని, ప్రముఖ సినీ నటులు,జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొందరు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన గిరి పుత్రులతో మమేకమయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం లోని నందిగరువు వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కరానికి నిబద్ధతతో పని…

Read More

జనసేన ఆవిర్భావ దినోత్సవం.

భీమవరం : మార్చి ,14 (తెలుగు న్యూస్ పవర్. కామ్ ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్తు కోసం నిరంతరం పని చేస్తున్న పార్టీ జనసేన పార్టీ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు భీమవరం ఆనంద పంక్షన్ హాల్లో శనివారం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ…

Read More

దేవాన్ష్ పంచకట్ల సందడి.

హైదరాబాద్: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు,విద్యాశాఖ మంత్రి, నారా లోకేష్, బ్రాహ్మణి ముద్దుల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుక అత్యంత సన్నిహితుల మధ్య శనివారం జరిగింది. ధోతి (నూతన వస్త్ర బహుకరణ) వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిర్వహించారు. నారా–నందమూరి కుటుంబాల్లో ఆనంద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల సందడి ఈ వేడుకకు తాత నందమూరి బాలకృష్ణ, నానమ్మ…

Read More

జనసేన జెండా ఆవిష్కరణ.

పాలకొల్లు: మార్చి,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, స్థానిక డీలక్స్ సినిమా రోడ్ లో గల ఆంజనేయ స్వామి గుడి సమీపంలో జనసేన పార్టీ పతాకాన్ని స్థానిక క్షీరా రామలింగేశ్వర ఆలయ ధర్మకర్త పినిశెట్టి శ్రీనివాస్,చిన్ని ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. స్థానిక మారుతి సెంటర్, రామారావు పేట, గాంధీ బొమ్మల సెంటర్, సాయిబాబా గుడి రోడ్డు, టిట్కో కాలనీ, తదితర పలుచోట్ల పథకావిష్కరణ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా…

Read More

పలాసలో కేంద్రియ విద్యాలయ

న్యూఢిల్లీ: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉత్తరాంధ్రకు వరంగా, పలాసలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు శనివారం వెల్లడించారు. విద్యా సంవత్సరం(2026–27) నుంచి తరగతులు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. శ్రీకాకుళం ప్రాంతానికి ఎంతో ముఖ్యమైన ఈ విద్యాసంస్థను ఆమోదించి,ప్రారంభానికి సహకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు…

Read More