Skip to main content

Telugu News Power

టూరిస్ట్ బస్సు ఆపరేటర్లకు భారీ ఊరట, కూటమి ప్రభుత్వ వరం. -బస్సు ఆపరేటర్ల కృతజ్ఞతలు. -మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవ.

అమరావతి: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్(ఏఐటిపి) కలిగిన టూరిస్ట్ బస్సులపై త్రైమాసిక పన్నును తగ్గించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చొరవతో ఈ ప్రతిపాదనను క్యాబినెట్ పరిశీలించి, ఆమోదించింది. ప్రస్తుతం ప్రతి సీటుకు త్రైమాసికానికి రూ.4 వేలు గా ఉన్న పన్నును రూ.2,500కు తగ్గించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయంతో టూరిస్ట్ బస్సు యజమానులకు భారీ…

Read More

వైసిపి పాలనలో దేవాదాయ శాఖ నిర్వీర్యం. -మంత్రి ఆనం ఆరోపణ

తిరుమల: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత వైసిపి ప్రభుత్వం దేవాదాయ శాఖను నిర్వీర్యం చేసిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. మంత్రి మంగళవారం తిరుమలలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క శాఖ కూడా అధిపతి లేకుండా ఐదేళ్లు అస్తవ్యస్త పాలన సాగించిందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ, అంతర్వేది రథం దహనం, రామతీర్థం విగ్రహ ఖండన వంటి హిందూ వ్యతిరేక దుర్మార్గాలకు ఒడిగట్టారని విమర్శించారు. ఆ…

Read More

పశు సంపద కోసం రైతులకు అవగాహన కార్యక్రమం. -మంత్రి అచ్చెం నాయుడు

విజయవాడ: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో రానున్న వ్యవసాయ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాల నేపథ్యంలో, పశుసంపద రక్షణ, పశుపోషకుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ చేపట్టింది. వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, పశువులకు పచ్చిమేత కొరత తలెత్తకుండా చూడాలనే లక్ష్యంతో పశుసంవర్ధక శాఖ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పశుగ్రాసాల సాగును ప్రోత్సహిస్తోంది.ఇందులో భాగంగా “ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ (పి ఎం డి ఎస్)” రుతుపవనాలకు ముందేపూడి…

Read More

అమోనియ లీకేజీ పట్ల తుందుర్రు గ్రామస్తుల ఆందోళన.

వీరవాసరం : జూన్, 23{ తెలుగు న్యూస్ పవర్. కామ్ ) ఇటీవల తమిళనాడులో రొయ్యల ఫ్యాక్టరీలో జరిగిన అమోనియా లీకేజీ సంఘటన పట్ల తుందురువాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న రియల్ ఫ్యాక్టరీలో సంభవించిన అమూల్య లీకేజీ ప్రమాదం వల్ల 8 మంది మృతి చెందగా, 80 మంది ఆసుపత్రి పాలైనట్టు గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామాల మధ్యలో ఏర్పాటు చేసిన గోదావరి మెగా ఫుడ్ పార్క్ వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటని…

Read More

బడుగు బ్రాహ్మణ కుటుంబానికి ఆర్థిక సాయం.

పాలకొల్లు: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం మరోసారి తన ఔదార్యం చాటుకున్నది. బడుగు బ్రాహ్మణ కుటుంబానికి, తమ సంఘ సభ్యుల సౌజన్యంతో 30 వేల రూపాయల ఆర్థిక సహాయంతో ఆదుకునే ప్రయత్నం చేసింది. స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో పురోహితునిగా సేవలందిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్ కు ఈ సాయం అందించారు. వీరి కుమారుడు సాయి శ్రీరామ్ గత కొంతకాలంగా అరుదైన చర్మ వ్యాధితో…

Read More

రైళ్లలో భిక్షాటన, అనధికారిక వ్యాపారాలపై కేంద్రం నిషేధం.

న్యూఢిల్లీ: జూన్,22 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జన్ విశ్వాస్ చట్టం-2026 క్రొత్త నిబంధనల ప్రకారం రైళ్లలో పొగతాగితే అప్పటికప్పుడే రూ.2,000 జరిమానా విధిస్తారు. అనధికారిక వ్యాపారాలు, భిక్షాటనపై పూర్తి నిషేధం అమలులోకి వచ్చింది. జరిమానా కట్టకపోతే 3 నెలల జైలు లేదా రూ.5 వేల జుర్మాన వేస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రైలు నుంచి దింపేసేలా అధికారులకు వీలు కల్పించారు. రైలు ప్రయాణికుల భద్రత, ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు…

Read More

ముఖ్యమంత్రి, మంత్రికి కర్ణాటక ఆహ్వానం.

అమరావతి: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర జలవనులను శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు తో కర్ణాటక ప్రతినిధి బృందం సోమవారం సచివాలయంలో భేటీ అయింది. తుంగభద్ర ఆనకట్ట నూతన గేట్లు ఈనెల 25న ప్రారంభిస్తున్న సందర్భంగా వారు ఆహ్వానం అందజేశారు. కర్ణాటక చిన్న తరహా నీటిపారుదల శాఖ మాజీ మంత్రి ఎన్ ఎస్ బోసు రాజు, ఎమ్మెల్యే బసవరాజు రాయ్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవన్న గౌడ బదర్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read More

ఉభయగోదావరి జిల్లాలలో కలకలం రేపిన యువతి హత్య.

నర్సాపురం: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టపగలు జరిగిన యువతి హత్య పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సూళ్లూరుపేటలో ఏఎన్ఎం శిక్షణ పొందుతున్న జాలెం షైనీ రోజా రైలులో నరసాపురం సోమవారం చేరుకుంది. స్వగ్రామం అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి కార్లో ప్రయాణం అయింది. కారు సురేష్ నడుపుతున్నాడు. మార్గమధ్యలో మార్గాని రమేష్ కారులోకి ఎక్కాడు. స్థానిక పెట్రోల్ బంకు సమీపంలో మంచి నీటి కోసం కారు నడుపుతున్న సురేష్…

Read More

అనుమతులు లేని మంత్రి గారి బడి మూత.

భీమవరం: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నారాయణ స్కూల్‌ను విద్యాశాఖ అధికారులు సోమవారం మూసివేయించారు. ఎటువంటి అనుమతులు, లేకుండానే తరగతులు నిర్వహిస్తుండటంతో అధికారుల చర్యలు చేపట్టారు.స్కూల్ భవన నిర్మాణం పూర్తికాకుండానే క్లాసులు నడపడంపై ఎస్ఎఫ్ఐ నాయకుల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.నియమ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ ప్రాంగణంలోనే పుస్తకాలు, విద్యాసామాగ్రి విక్రయాలు జరపటం పట్ల వారు అభ్యంతరం తెలిపారు. మంత్రి నారాయణ పదవి వదిలి స్కూళ్లలో పుస్తకాలు, బ్యాగులు అమ్ముకోవాలంటూ ఎస్ఎఫ్ఐ మండిపడ్డారు.ఎటువంటి…

Read More

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.

పాలకొల్లు: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గం లో నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 76 మందికి రూ. 66.42 లక్షలు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు సోమవారం రాత్రి తన క్యాంపు కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పరుగులు కూటమి నాయకులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Read More