టూరిస్ట్ బస్సు ఆపరేటర్లకు భారీ ఊరట, కూటమి ప్రభుత్వ వరం. -బస్సు ఆపరేటర్ల కృతజ్ఞతలు. -మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవ.
అమరావతి: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్(ఏఐటిపి) కలిగిన టూరిస్ట్ బస్సులపై త్రైమాసిక పన్నును తగ్గించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చొరవతో ఈ ప్రతిపాదనను క్యాబినెట్ పరిశీలించి, ఆమోదించింది. ప్రస్తుతం ప్రతి సీటుకు త్రైమాసికానికి రూ.4 వేలు గా ఉన్న పన్నును రూ.2,500కు తగ్గించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయంతో టూరిస్ట్ బస్సు యజమానులకు భారీ…