Telugu News Power

గీత కార్మికుని కుటుంబానికి మంత్రి 2.50 లక్షల సాయం.

పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు తన క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం గీత కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. స్థానిక పాలమూరుకు చెందిన గీత కార్మికుడు, ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణించిన సందర్భంగా, వారి భార్య శ్రీదేవికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన 2లక్షల రూపాయలతో పాటు, మంత్రి వ్యక్తిగతంగా 50 వేల రూపాయలు అందజేశారు. ఈ రెండున్నర లక్షల రూపాయలతో,…

Read More

అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించిన మంత్రి.

పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు రామానాయుడు పట్టణంలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక 27 వార్డులో స్మశాన వాటిక పనుల పురోగతిని పరిశీలించి, అందంగా తీర్చిదిద్దడానికి పోలీసులను చేశారు. స్థానిక 100 పడకల ఆసుపత్రి సుందరీకరణ పనులు పరిశీలించారు. కొత్త కులాయిచెరువు గట్టు పటిష్టత గురించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీలో డ్రోన్ పైలెట్ శిక్షణ.

పాలకొల్లు: ఫిబ్రవరి,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం మరియు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు, అనంతపురం జిల్లా వారి ఆర్థిక సహకారంతో, పీఎం–ఉషా జి.ఐ.ఈ. ఐ స్కీంలో భాగంగా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ ముంబై, కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–I, II మరియు మహిళా సాధికారతా విభాగం వారి ఆధ్వర్యంలో బాలికలకు ప్రత్యేక…

Read More

భవన నిర్మాణానికి గాంధీ భగవాన్ రాజు లక్షన్నర విరాళం.

పాలకొల్లు: ఫిబ్రవరి,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఆర్టిస్టులు, పెయింటర్లు వెల్ఫేర్ అసోసియేషన్ భవనం నిర్మాణంలో కొనసాగుతున్నది. ఈ భవన నిర్మాణానికి, దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఈ అసోసియేషన్ నాయకులు, సోమవారం, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, కాస్మో కల్చరల్ క్లబ్ అధ్యక్షులు, గాంధీ మెగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజును కలిసి, భవన నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా, భగవాన్ రాజు తన సొంత నిధుల నుంచి 50 వేల…

Read More

ఉపాధ్యాయ డిమాండ్లపై యుటిఎఫ్ పోస్ట్ కార్డ్ ఉద్యమం

పాలకొల్లు: ఫిబ్రవరి, 9(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ, యుటిఎఫ్ చేపట్టిన ఉద్యమంలో భాగంగా, సోమవారం పోస్ట్ కార్డులు, స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం, తపాలా పెట్టిలో ఉత్తరాలు వేసే కార్యక్రమాన్ని, జిల్లా ప్రధాన కార్యదర్శి,పోలిశెట్టి క్రాంతికుమార్ ప్రారంభించినారు. పి ఆర్ సి కమిషన్ వెంటనే నియమించాలని, డి ఏ బకాయలు చెల్లించాలని, మధ్యంతర బృతి, తక్షణమే ప్రకటించాలని, ఉత్తరాల్లో, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అధ్యక్షులు జి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి పి రామమూర్తి నాయుడు…

Read More

కాపులకు 5 శాతం ఈడబ్ల్యూఎస్ కోట వర్తింప చేయాలి -రాష్ట్రీయ జన సంక్షేమ సేన డిమాండ్.

పాలకొల్లు: ఫిబ్రవరి,9(తెలుగు న్యూస్ పవర్) టిడిపి ప్రభుత్వం గతంలో ఇచ్చిన జిఓ ప్రకారం కాపు రిజర్వేషన్ కోరుతూ మాజీ మంత్రి,ఎంపీ,చేగోండి హరి రామ జోగయ్య, ముత్యాల శ్రీనివాస్, రాష్ట్రీయ జన సంక్షేమ సేన తరపున సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు లేఖ సంధించారు. అగ్రవర్ణాలైనా కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య , క్షత్రియ, వెలమ మొదలగు కులాలతో విద్య ఉద్యోగ రంగాలలో పోటీ పడలేక కాపులు వెనుకబడి…

Read More

తాళాబత్తులకు ఘనసత్కారం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక, నటినట సంక్షేమ సమాఖ్య, తాళబత్తుల వెంకటేశ్వరరావుకు జరిగిన సత్కారం గురించి సోమవారం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు,పాలకొల్లు ముద్దుబిడ్డ రచయిత,కళాభిమాని,కళాకారుడు, నాటక సంస్థ ప్రతినిధిగా ఎన్నో ఏళ్లుగా కళామతల్లి సేవలో తరిస్తున్న, తాళ బత్తుల వెంకటేశ్వరరావుకు, గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన కళామందిరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మరియు వేదిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న భారతరంగ్ మహోత్సవ్ అంతర్జాతీయ నాటకోత్సవాల సందర్భంగా ప్రతిష్టాత్మకమైన, సత్కారం అందుకున్నారు….

Read More

యలమంచిలి మండలంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన.

యలమంచిలి; ఫిబ్రవరి,8 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరులు శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం యలమంచిలి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా బూరుగుపల్లిలో 3కోట్ల 55 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రక్షిత మంచినీటి పథకం పనులకు 66.40 లక్షల రూపాయలు, ఏటిగట్టు గ్రావెల్ రోడ్డు 2.52 లక్షలు, విలేజ్ హెల్త్ క్లినిక్ కు 36 లక్షల పనులకు శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారు. శిరగాలపల్లిలో రైతులకు నూతన క్యూ…

Read More

ఉండి రైతులకు 28 లక్షలతో ఉచిత స్ప్రేయర్లు పంపిణీ.

ఉండి: ఫిబ్రవరి, 8 (తెలుగు న్యూస్ పవర్) ఉపసభావతి, మాజీ ఎంపీ, స్థానిక శాసనసభ్యులు, కనుమూరి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద జరిగిన కార్యక్రమంలో 400 మంది రైతులకు ఉచితంగా బ్యాటరీతో పనిచేసే స్ప్రేయర్లు పంపిణీ చేశారు. ఐ సి ఏ ఆర్- భారతీయ వరి పరిశోధనా సంస్థ, హైదరాబాద్ వారి సౌజన్యంతో 28 లక్షల విలువైన ఈ ప్రేయర్ లో రైతులు అనుకున్నారు. రైతులు ఆధునిక, సాంకేతిక వ్యవసాయ…

Read More

వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ పై కార్మికలోకం హర్షం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 8(తెలుగు న్యూస్ పవర్) భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ నిర్ణయం పై ప్రభుత్వానికి, స్థానిక శ్రీ వెంకటేశ్వర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. స్థానిక సంఘ కార్యాలయ భవనంలో ఆదివారం జరిగిన సంఘ సమావేశంలో హర్షం ప్రకటించారు. ఈ సమావేశానికి పెచ్చెట్టి బాబ్జి అధ్యక్షత వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు చొరవతో, కార్మిక శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్ కృషి వల్ల బోర్డు మళ్లీ జీవం పోసుకోవడం తమకు…

Read More