Telugu News Power

ప్రధాని పిలుపుమేర కు కేంద్రమంత్రి వర్మ మెట్రోలో ప్రయాణం.

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తన అధికారిక కాన్వాయ్‌ను వదిలి దిల్లీ మెట్రోలో శనివారం ప్రయాణించారు. ఈ సందర్భంగా, వర్మ మాట్లాడుతూ, మనం ఆదా చేసే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్ — భారతదేశానికి ఆదా చేసిన విదేశీ మారక ద్రవ్యం లోటు భర్తీ చేస్తుందన్నారు. మెట్రోలో ప్రయాణించే ప్రతి కిలోమీటర్ — మన ఆర్థిక వ్యవస్థకు బలం, మన పర్యావరణానికి…

Read More

ఈనెల 20న మందుల షాపులు బంద్.

పాలకొల్లు: మే,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20న దేశవ్యాప్తంగా జరిగే బందుకు ప్రజలు సహకరించాలని పశ్చిమగోదావరి జిల్లా సంఘ అధ్యక్షులు తట్టవర్తి కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ భవనంలో శనివారం జరిగిన సమావేశంలో ప్రతినిధులు మాట్లాడారు. మందుల షాపుల యజమానులు, సిబ్బంది ఈ ఆందోళన కార్యక్రమంలో తప్పక పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా బంద్ రోజు కొన్ని మందుల షాపులు తెరిచి ఉంచుతామని భరోసా…

Read More

రైతు కుటుంబాల ఆనందానికి కూటమి ప్రభుత్వం అండ. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: మే,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతుల కుటుంబాల్లో ఆనందానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రూ. 5.15 కోట్ల నిధులతో జరుపు తలపెట్టిన అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా తెల్లపూడిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 46’లక్షల మంది రైతులకు ఇప్పటివరకు రూ. 8,965 కోట్ల రూపాయలు…

Read More

కేంద్ర మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలిగా డాక్టర్ దగ్గుబాటి. పురందేశ్వరి.

లోక్‌సభ స్పీకర్ మహిళా సాధికారత కమిటీ (2026-27)ని అధికారికంగా ప్రకటించారు. ఈ కమిటీకి అధ్యక్షురాలిగా ఆంధ్ర ప్రదేశ్, రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు డాక్టర్ డి. పురందేశ్వరి నియమితులయ్యారు. లోక్‌సభ సభ్యులు (18 మంది): డాక్టర్ డి. పురందేశ్వరి, స్మత్. లవ్లీ ఆనంద్, స్మత్. డి.కె. అరుణ, స్మత్. హర్సిమ్రత్ కౌర్ బాదల్, స్మత్. శోభనాబెన్ మహేంద్రసింహ్ బరాయియా, మిస్. ఇక్రా చౌదరి, స్మత్. కృతి దేవి డెబ్బర్మన్, కుమారి ప్రియాంక సతీష్ జార్కిహోలి, డాక్టర్ కాడియమ్…

Read More

ప్రఖ్యాత రచయిత్రి శారద ఆసుపవర్ధన్ ఇక లేరు.

సికింద్రాబాద్: మే,15(తెలుగు న్యూస్ పవర్. కామ్)ప్రఖ్యాత రచయిత్రి, ప్రసిద్ధ కవయిత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి శారదా అశోకవర్ధన్ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శారదా అశోకవర్ధన్ 28 జూలై 1938 న సికింద్రాబాద్‌లో జన్మించారు. తన 87ఏళ్ల ప్రస్థానంలో సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలోనూ కలిపి 82 గ్రంథాలు వెలువరించారు. శారద అశోకవర్ధన్ ఆకాశవాణిలో ఫీల్డ్ ఆఫీసర్ గా జవహర్ బాల భవన్ సంచాలకులుగా ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ కమిషనర్ గా ఉద్యోగం చేశారు సెంట్రల్…

Read More

పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక అధికారిని కలిసిన ఎమ్మెల్యే నాయకర్.

అమరావతి: మే,15(తెలుగు న్యూస్ పవర్. కాం) వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల ఏర్పాట్ల గురించి నరసాపురం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గుమ్మడి నాయకర్ శుక్రవారం అమరావతి సచివాలయంలో పుష్కరాల ప్రత్యేక అధికారి ఐఏఎస్ జి. వీరపాండియన్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు, అభివృద్ధి పనులు, నిధుల మంజూరు అంశాలపై వీరిరువురు విస్తృతంగా చర్చించారు. పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు విచ్చేసే నేపథ్యంలో, వారికి మెరుగైన సౌకర్యాలు అందించేలా ఘాట్ల అభివృద్ధి, రహదారుల…

Read More

జిఎస్టి భారీ కుంభకోణం రూ.17 వందల కోట్లు.

విశాఖపట్నం: మే, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్) విశాఖ జీఎస్టీ నిఘావిభాగం భారీ కుంభకోణాన్ని బయటపెట్టింది. సుమారు 17వందల కోట్ల రూపాయల భారీ నకిలీ ఇన్ వాయిస్ ల కుంభకోణాన్ని విశాఖ జిఎస్టి నిఘా విభాగం అత్యంత చాకచక్యంగా ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. ఈ కేసు సంబంధించి ప్రధాన కుట్రధదారు ధంట్ల ఆదిరెడ్డి (అలియాస్ అంజిరెడ్డి)ని డి జి జి ఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ మోసంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడినట్లు…

Read More

ఉద్యోగం పోగొట్టుకున్న పద్మ జైస్వాల్, ఐఏఎస్.

న్యూఢిల్లీ: మే,15(తెలుగు న్యూస్ పవర్. కాల్) ఐఏఎస్ అధికారిణి పద్మ జైస్వాల్ సేవల నుంచి తొలగించారు. అత్యంత పిన్నవయస్కురాలుగా ఐఏఎస్ లో గుర్తింపు పొందారు. ప్రజా నిధుల దుర్వినియోగం ఆరోపణలపై కేంద్రం కఠిన చర్య పద్మ జైస్వాల్ అనే ఐఏఎస్ అధికారిణిని కేంద్ర ప్రభుత్వం సేవల నుంచి తొలగించింది. 2003 బ్యాచ్‌కు చెందిన ఆమె, అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కామెంగ్ జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ప్రజా నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు…

Read More

నిందితుడికి ఉరిశిక్ష వేయించిన పోలీసు బృందానికి సత్కారం.

హైదరాబాద్: మే, 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్)సనత్‌నగర్‌ బాలుడి దారుణ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా పకడ్బందీగా ఆధారాలు సేకరించి, కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పోలీస్, ప్రాసిక్యూషన్ బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు సన్మానించారు.ఈ శిక్ష ఖరారులో కీలక పాత్ర పోషించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.వి. రామకృష్ణారావు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముత్తు యాదవ్, సనత్ నగర్ ఎస్‌హెచ్‌ఓ అశోక్, ఎస్‌ఐ అబ్దుల్ హయ్యుమ్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ శేఖర్‌లను అభినందించారు.నేరస్థులు ఎంతటి వారైనా చట్టం…

Read More

అపర భగీరధుడు సర్ ఆర్థర్ కాటన్ బాటలో మంత్రి నిమ్మల -వాటర్ డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ పెనుమత్స రాంభద్ర రాజు.

పాలకొల్లు: మే ,15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అపర భగీరధుడు సర్ ఆర్థర్ కాటన్ ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఉభయగోదావరిజిల్లాలు ఆంధ్ర అన్నపూర్ణగా విరసిల్లుతున్నాయని పాలకొల్లు వాటర్ డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ పెనుమత్స రామ్ భద్ర రాజు పేర్కొన్నారు. బ్రిటిష్ ఇంజనీర్, గోదావరి జిల్లాల ప్రజల తాగునీటి కోసం, రైతులకు సాగునీటి కోసం ధవలేశ్వరం వద్ద నిర్మించిన ఆనకట్టకు సృష్టికర్త కాటన్ మహనీయుని 266వ జయంతి వేడుకలు స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద శుక్రవారం ఘనంగా…

Read More