Skip to main content

Telugu News Power

సిండికేట్ల గలాటా తో, రేవు పాట వాయిదాల పర్వం.

యలమంచిలి: జులై, 16( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అబ్బిరాజుపాలెం సోంపల్లి మధ్య గోదావరి నదిపై పై ఫంటు నడుపుకోవడానికి నిర్వహించ తలపెట్టిన వేలం పాట ప్రక్రియ గురువారం మరోసారి బెడిసికొట్టింది. అధికారులు ముచ్చటగా మూడోసారి వేలంపాట వాయిదా వేయగలిగారు. ప్రభుత్వం నీవు పాటకు రూ. 13 లక్షలు అప్సర్డ్ ప్రైస్ గా నిర్ణయించింది. పాటదారులు రూ. 7.50,8.10,10 లక్షల వరకు చెల్లించటానికి మూడు జరిగిన రేవు పాట సందర్భాల్లో ఆసక్తి చూపించారు. మండల అభివృద్ధి…

Read More

ముద్రగడకు యలమంచిలి మండలంలో ఘన నివాళి.

య లమంచిలి: జులై, 15( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండలంలోని మేడపాడు సెంటర్లో పలువురు నాయకులు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి,, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం మృతికి బుధవారం ఘన నివాళులు అర్పించారు. ముద్రగడ కాపుల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేశారని వక్తలు కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ఆయన తన జీవితంలో ఆచరించి చూపిన వ్యక్తిని ప్రశంసించారు. ఆయన బాటలో నడిచిన ముద్రగడ బలహీన వర్గాల వారు స్త్రీల సమస్యల పరిష్కారం కోసం…

Read More

ముంబయి ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్.

ముంబై: జులై, 15( తెలుగు న్యూస్ పవర్. కాం) ప్రముఖ నటులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కోకిల ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స అనంతరం బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వీరికి కుడి భుజం దెబ్బతిన్న కారణంగా శాస్త్ర చికిత్స జరిగింది. వీరు నేరుగా హైదరాబాద్ లోని నివాసానికి చేరు కొంటారు. వైద్యుల సూచన మేరకు మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ ప్రారంభిస్తారని. వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేసిన భుజం…

Read More

కాపు ఉద్యమ నేత ముద్రగడకు ఘన నివాళి.

పాలకొల్లు: జూలై, 15 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) మాజీ మంత్రి, మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కు స్థానిక పట్టణ ప్రముఖులు, ముద్రగడ అభిమానులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు కాపు జాతి ఐక్యత కోసం ముద్రగడ చేసిన సేవలను కొనియాడారు. పాలకులతో…

Read More

పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏఎమ్ ఓ, చంద్రశేఖర్ తనిఖీ.

యలమంచిలి: జూలై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా పీఎం శ్రీ పాఠశాల లను పర్యవేక్షించుటలో భాగంగా మంగళవారం దొడ్డిపట్ల,, పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , జిల్లా ఏ ఎం ఓ సిహెచ్ చంద్రశేఖర్, యలమంచిలి మండలం ఎంఈఓ 1 జి వీరస్వామి సందర్శించారు.పాఠశాలలోని మౌలిక వసతులు లేబరేటరీ ,లైబ్రరీ ,స్కౌట్ అండ్ గైడ్స్, కిచెన్ గార్డెన్ ,కంపోస్ట్ ఫిట్ , రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ,రైన్ వాటర్ హార్వెస్టింగ్…

Read More

ముగిసిన ముద్రగడ శకం కాపు ఉద్యమ నేతగా కీర్తి శిఖరాలుకు.

కాకినాడ: జులై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి కి చెందిన ముద్రగడ పద్మనాభం నాలుగు సార్లు శాసనసభ్యులుగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, విజయ భాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. కాపు ఉద్యమ నేతగా ఉభయ రాష్ట్రాల్లో కీర్తి గడించారు. కాపుల…

Read More

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించిన మంత్రి కందుల, ఎమ్మెల్యే పంతం.

ముంబయి: జులై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే 19 నానాజీ విడివిడిగా మంగళవారం కోకిల బెన్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఇటీవల కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలను పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, ప్రజాసేవ, పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయి సమస్యల…

Read More

కలెక్టరేట్ ముట్టడి విజయవంతం -ఫ్యాప్టో

భీమవరం: జూలై, 14 ( తెలుగు న్యూస్ పవర్. కామ్)ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12 వ పిఆర్సీని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్ డిఏ లను, ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి భారీ సంఖ్యలో హాజరైన ఉపాధ్యాయులతో కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల సహకారం తో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పై ఉద్యోగులు…

Read More

మాస శివరాత్రికి, మహాశివరాత్రిలా పోటెత్తిన భక్తులు.

పాలకొల్లు: జులై,13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మాస శివరాత్రి సందర్భంగా, స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దర్శనం కోసం సోమవారం భక్తులు పోటెత్తారు. అధికారుల అంచనాలకు అందనంతగా, వేల సంఖ్యలో పంచారామ క్షేత్ర దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. రాత్రి 8:30 గంటల వరకు కూడా ప్రత్యేక దర్శనం టికెట్లు కోసం భక్తులు బారులు తీరారు. నిత్య అన్నదాన పథకంలో భాగంగా సుమారు 1500 మంది భక్తులు…

Read More

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మల్లికార్జున స్వామి వారికి ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి సత్యవాణి పూజలు.

భీమవరం : జులై,13( తెలుగు న్యూస్ పవర్. కామ్) డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కుదటపడి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సతీమణి సత్యవాణి ప్రత్యేక పూజలను నిర్వహించారు. చిన గొల్లపాలెంలోని శ్రీపార్వతీ సమేత మల్లికార్జున స్వామివారికి ఆలయ అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలను నిర్వహించారు. అందరి శ్రేయస్సు కోరే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు.

Read More