Skip to main content

Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీలో నులి పురుగు నివారణ కార్యక్రమం.

విద్యార్థికి నులిపురుగు నివారణ మాత్ర వేస్తున్న దృశ్యం.

పాలకొల్లు: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) జాతీయ నులి పురుగు నివారణ కార్యక్రమం, మంగళవారం, స్థానిక ఏయస్ఎన్ యం, ప్రభుత్వ కళాశాలలో మంగళవారం జరిగింది. వైద్యులు ఎం సౌభాగ్యవతి, ఆల్బెండజోల్ మాత్రలు విద్యార్థులందరూ తప్పక వేసుకోవాలని సూచించారు. రక్తహీనతను తగ్గించడం, శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ టి. రాజరాజేశ్వరి, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ లక్ష్మి, టి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.