Telugu News Power

పాఠశాలలో విద్యార్థులను చేర్పించిన ఎంపీడీవో.

విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వపాఠశాల వల్ల ప్రయోజనాలు వివరిస్తున్న అధికారులు.

పాలకొల్లు: జూన్, 3 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక లంకలకోడేరు, పెదపేట పాఠశాల పరిధిలోగల ఇంటింటికి వెళ్లి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా ఎంపీడీవో ఎస్. ఎన్. ఉమామహేశ్వరరావు, ఎంఈఓ గంగాధర శర్మ, ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ బృందం తల్లిదండ్రులను కలసి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయల, ఉచిత ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోటు పుస్తకాలు, మధ్యాహ్నం భోజన పథకం, ద్వార తల్లిదండ్రుల పై అర్థికభారం పడకుండా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడీఓ కోరారు.